వైరల్‌గా ఫుడ్‌ ఛాలెంజ్‌.. 20 నిమిషాల్లో లాగించండి 20 వేలు గెలవండి! వీడియో

సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. గ్రీన్‌ ఛాలెంజ్‌, మిల్క్‌ క్రేట్‌ ఛాలెంజ్‌లు వైరల్‌గా మారి దూసుకుపోవడం చూసాం. తాజాగా ఓ గల్లీ పుడ్‌ స్టాల్‌ యజమాని భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్‌ విసిరాడు.

వైరల్‌గా ఫుడ్‌ ఛాలెంజ్‌.. 20 నిమిషాల్లో లాగించండి 20 వేలు గెలవండి! వీడియో

|

Updated on: Oct 05, 2021 | 8:45 AM

సోషల్‌మీడియాలో ఛాలెంజ్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. గ్రీన్‌ ఛాలెంజ్‌, మిల్క్‌ క్రేట్‌ ఛాలెంజ్‌లు వైరల్‌గా మారి దూసుకుపోవడం చూసాం. తాజాగా ఓ గల్లీ పుడ్‌ స్టాల్‌ యజమాని భోజన ప్రియులకు ఓ ఛాలెంజ్‌ విసిరాడు. అదేంటంటే.. ఓ రోల్‌ని జస్ట్ 20 నిమిషాల్లో తిని 20 వేలు గెలుచుకోవచ్చంటూ అందరినీ ఆకర్షించాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ మోడల్ టౌన్ థర్డ్‌లో ఓ పుడ్‌ స్టాల్‌ యజమాని తను తయారు చేసిన 10 కేజీల బాహుబలి కథీ రోల్‌ను కేవలం 20 నిమిషాల్లో తింటే 20,000 వేల రూపాయలు ఇస్తానని పుడ్‌ లవర్స్‌కి బంఫర్‌ ప్రకటించాడు. ఇక ఆ రోల్‌ మేకింగ్‌ వీడియోని సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ఛాలెంజ్‌ ఎవరైనా స్వీకరించవచ్చని తెలిపాడు. ఆ రోల్‌ని.. గోధుమపిండితో తయారుచేసి 30 గుడ్లను ఆమ్లెట్‌గా వేయడంతో పాటు అదనంగా అందులో నూడుల్స్, కబాబ్స్, సోయా చాప్‌తో నింపేశాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అతి పొడవైన చెవులతో గిన్నిస్ రికార్డు కొట్టింది.. వీడియో

అమెరికా కోర్ట్ సంచలన తీర్పు.. హంతకుడికి 5 యావజ్జీవ శిక్షలు.. వీడియో

Follow us