Ravana Temple: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ.! అదే రోజు రావణుడి ఆలయంలోకి సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ.
500 ఏళ్ల కల నెరవేరే ఆ మధుర క్షణాలు పూర్తయ్యాయి. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన ఆలయాన్ని జనవరి 22న ప్రధాని మోదీ ప్రారంభించారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లాను ఆలయంలో ప్రతిష్ఠించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజునే నొయిడా సమీపంలో మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి బిస్రఖ్ గ్రామంలో రావణుడిని ఆరాధించే ఓ పురాతన శివాలయంలో స్థానికులు సీతారాముడు, లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు.
500 ఏళ్ల కల నెరవేరే ఆ మధుర క్షణాలు పూర్తయ్యాయి. అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో నిర్మించిన ఆలయాన్ని జనవరి 22న ప్రధాని మోదీ ప్రారంభించారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లాను ఆలయంలో ప్రతిష్ఠించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజునే నొయిడా సమీపంలో మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి బిస్రఖ్ గ్రామంలో రావణుడిని ఆరాధించే ఓ పురాతన శివాలయంలో స్థానికులు సీతారాముడు, లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడ నివసించేవారు అనాదిగా రావణాసురుడిని పూజిస్తున్నారు. రావణుడి తండ్రి విశ్రవసుడి జన్మస్థలం ఇదేనని, రావణుడు తమ పూర్వీకుడని గ్రామస్థులు విశ్వసిస్తున్నారు. అందుకే విజయదశమికి రావణుడి బొమ్మను దహనం చేసే సంప్రదాయం కూడా తాము పాటించమని వారు చెబుతున్నారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని రావణుడి తాత పులస్త్యముని ప్రతిష్ఠించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇక్కడ రావణుడి విగ్రహం లేకపోయినా, గోడలపై రావణుడి జీవితంలోని కీలక ఘట్టాలను తెలిపే చిత్రాలను ముద్రించారు. వచ్చే విజయ దశమికి రాముడి విగ్రహం పక్కనే రావణుడి ప్రతిమను ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఇద్దరికీ కలిపి పూజలు నిర్వహిస్తామని ఆలయ పూజారి తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

