AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాన నీటిలో సరదాగా పరుపుపై తేలిన ఓ వ్యక్తి.. వీడియో వైరల్

వాన నీటిలో సరదాగా పరుపుపై తేలిన ఓ వ్యక్తి.. వీడియో వైరల్

Phani CH
|

Updated on: Jun 10, 2024 | 5:17 PM

Share

మహారాష్ట్రలోని పుణేలో శుక్రవారం భారీగా వాన కురిసింది. ఈ వర్షానికి ఓ రోడ్డుపై నీరు నిలిచింది. దీంతో ఒక వ్యక్తి పరుపుపై వాన నీటిలో తేలియాడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీటితో నిండిన రోడ్డుపై ఒక వ్యక్తి పరుపుపై తేలుతూ ముందుకు వెళ్లాడు. అయితే అతని పక్కనే కొన్ని వాహనాలు కూడా వెళ్లటం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

మహారాష్ట్రలోని పుణేలో శుక్రవారం భారీగా వాన కురిసింది. ఈ వర్షానికి ఓ రోడ్డుపై నీరు నిలిచింది. దీంతో ఒక వ్యక్తి పరుపుపై వాన నీటిలో తేలియాడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నీటితో నిండిన రోడ్డుపై ఒక వ్యక్తి పరుపుపై తేలుతూ ముందుకు వెళ్లాడు. అయితే అతని పక్కనే కొన్ని వాహనాలు కూడా వెళ్లటం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పలువురు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. పూణేతో పాటు ముంబయిలో శనివారం అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ముంబైలోని దహిసర్ ప్రాంతంలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్, ముంబై సహా ఇతర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది. అదే సమయంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

“లైగర్‌” అమ్మాయి.. మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా పూజా తోమర్ రికార్డ్

ఒకే రన్‌వే పైకి రెండు విమానాలు.. తప్పిన ఘోర ప్రమాదం

సముద్రంలో పడిపోయిన ఐఫోన్ ను ఏడు గంటలు కష్టపడి వెదికి తెచ్చిన టీమ్

కంగన చెంపపై కొట్టిన కానిస్టేబుల్ కు బంగారు ఉంగరం.. ఎవరిస్తున్నారంటే ??

నెట్ ఫ్లిక్స్ పై రూ.1,419 కోట్లకు దావా వేసిన మహిళ