PM Modi: నేలపై నిద్ర, కొబ్బరి నీళ్లే ఆహారం.. రాముడి కోసం కఠిన దీక్షలో మోదీ.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈనెల 22వ తేదీన ప్రధాని మోదీ రామాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.దీక్షలో భాగంగా మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటూ అనుష్ఠాన దీక్ష చేపట్టారు.
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఈనెల 22వ తేదీన ప్రధాని మోదీ రామాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.దీక్షలో భాగంగా మోదీ కఠిన నియమాలు పాటిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటూ అనుష్ఠాన దీక్ష చేపట్టారు. ప్రాణ ప్రతిష్ఠ కోసం భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించే సాధనంగా దేవుడు తనను ఎన్నుకున్నట్లు ప్రధాని మోదీ ఇటీవల X వీడియో సందేశంలో తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తాను 11 రోజుల ప్రత్యేక దీక్షను చేపడుతున్నానని తెలిపారు. ప్రధాని 11 రోజుల కఠిన నియమాలకు కట్టుబడి ఉంటారని, గ్రంథాలలో పేర్కొన్న అన్ని సూచనలను కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నారని తాజాగా అధికారులు తెలిపారు.’యం నియమాన్ని పాటించే అభ్యాసకులు యోగా, ధ్యానంతో పాటు కఠినమైన కొన్ని ఇతర ప్రక్రియలను ఆచరించాల్సి ఉంటుందని అన్నారు. సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్త సమయంలో మేల్కొవడం, ధ్యానం, సాత్వికాహారం వంటివి ఇప్పటికే మోదీ దినచర్యలో భాగమయ్యాయి. ప్రస్తుతం 11 రోజుల కఠోరమైన దీక్షలో బాగంగా ఉపవాసం చేయాలని ప్రధాని నిర్ణయించారని అధికారులు తెలిపారు. మోదీ ఈ 11 రోజులూ నేలపైనే నిద్రిస్తున్నట్లు చెప్పారు. కేవలం కొబ్బరినీళ్ల ను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నట్లు వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

