వాష్రూమ్కి వెళ్దామని వెళ్లిన వ్యక్తి.. లోపల ఊహించని షాక్
వర్షాకాలం మొదలైంది.. పాముల సంచారం ఎక్కువైంది. ఎక్కడ చూసినా పాములే పాములు. ఇళ్లు, స్కూళ్లు, వాహనాలు ఎక్కడపడితే అక్కడ పాములు దర్శనమిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గుజరాత్లోని వలసాద్ జిల్లా ఛాలా ప్రాంతంలోని శ్రీరంగ్ సొసైటీ లోని ఓ ఇంట్లో ప్రమాదకరమైన విషసర్పం ప్రవేశించింది.
ఎప్పుడు ఎలా వెళ్లిందోకానీ ఆ ఇంటి టాయిలెట్ కమోడ్లో తిష్ట వేసింది. ఈ విషయం తెలియని ఆ ఇంటి యజమాని వాష్రూమ్కి వెళ్లింది. కమోడ్లో ఏదో కదులుతున్నట్టు అనిపించి పరిశీలించి చూసిన ఆమె ఒక్కసారిగా షాకయింది. భయంతో వెనుకకు పరుగెత్తుకొచ్చింది. ఆ మహిళ వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారమిచ్చింది. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా పామును బంధించాడు. ఇండియన్ స్పెక్టకుల్ కోబ్రా అనే ఈ పాము చాలా ప్రమాదకరమైనదని స్నేక్ క్యాచర్ తెలిపారు. సుమారు ఐదు అడుగుల పొడవున్న ఆ కోబ్రాను మహామహంత్ సురక్షితంగా పట్టుకున్నారు, దాంతో ఆ కుటుంబ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. పట్టుబడిన కోబ్రాను అటవీశాఖ సూచన మేరకు అడవిలో విడిచిపెట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పరగడుపున పుచ్చకాయ తింటే ఇన్ని లాభాలా.. తెలిస్తే బుర్రపాడు
రన్నింగ్ ట్రైన్లో రక్తం కారేలా కొట్టుకున్న మహిళలు !! చివరకు
నా ఒళ్లు.. నా ఇష్టం.. మీకేంటి నొప్పి !! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నటి కామెంట్స్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

