AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెల్లిని గ‌ర్భవ‌తి చేసిన అన్న.. విషయం తెలియడంతో..

చెల్లిని గ‌ర్భవ‌తి చేసిన అన్న.. విషయం తెలియడంతో..

Phani CH
|

Updated on: Oct 06, 2022 | 9:34 AM

Share

సభ్య సమాజం తలదించుకునే ఘటన బీహార్‌లో వెలుగుచూసింది. బంధాలను అనుబంధాలను లెక్క చేయని మైనర్ పిల్లలు చేయకూడని తప్పు చేశారు. చివరికి ఇంటి నుంచి పారిపోయేదాకి వెళ్లింది.

సభ్య సమాజం తలదించుకునే ఘటన బీహార్‌లో వెలుగుచూసింది. బంధాలను అనుబంధాలను లెక్క చేయని మైనర్ పిల్లలు చేయకూడని తప్పు చేశారు. చివరికి ఇంటి నుంచి పారిపోయేదాకి వెళ్లింది. బీహార్‌కు చెందిన మైనర్ బాలుడు, బాలిక ప‌క్క ప‌క్క నివాసాల్లోనే ఉంటారు. వీరి వ‌య‌సు 15 ఏండ్లు.. కాగా వ‌రుస‌కు అన్నాచెల్లెల్లు అవుతారు. అయితే ఇద్దరూ ఒకే పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. ఇద్దరు పక్క పక్క ఇళ్లల్లో ఉండటంతో కలిసి వెళ్లడం, రావడంతో ఇద్దరి సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరి మ‌ధ్య చనువు పెరిగి, శారీరకంగా దగ్గరయ్యారు. అయితే, బాలిక‌ ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో డాక్టర్‌ను సంప్రదించ‌గా, ఏడు నెల‌ల గ‌ర్భిణి అని తేలింది. దీంతో భ‌య‌ప‌డిపోయిన వారిద్దరూ బీహార్ నుంచి హైదరాబాద్‌కు రైల్లో చేరుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వారిని దివ్యద‌శ చైల్డ్ లైన్ ప్రతినిధులు గుర్తించారు. అనంత‌రం వారిని అదుపులోకి తీసుకుని ఆరా తీయ‌గా జ‌రిగిన విష‌యం చెప్పారు. ఇరు కుటుంబాల‌కు స‌మాచారం అందించారు. మొద‌ట బాలుడిని, ఆ త‌ర్వాత బాలిక‌ను వారి త‌ల్లిదండ్రుల‌కు అప్పగించారు. అయితే బాలిక పేరెంట్స్ జీఆర్పీ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా, ఆ కేసును బీహార్‌కు బ‌దిలీ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి గాడిద పాలు అమ్ముకుంటున్న యువకుడు

జుట్టు ముడవడమే ఆమె తప్పైంది.. కాల్చి చంపిన పోలీసులు !!

రైలు ఎక్కబోయి ప‌డ్డ ప్ర‌యాణీకుడు.. సెకనులో కాపాడిన ఆర్‌పీఎఫ్

చిన్నారుల భేల్‌పురి తయారీ .. నెట్టింట తెగ వైరల్‌

అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి.. పరీక్ష చేసి డాక్టర్లు షాక్‌.. అతని పొట్టలో

 

Published on: Oct 06, 2022 09:34 AM