AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: ఎక్కేందుకు దారి లేదు.. నిల్చోడానికి చోటు లేదు.! హైదరాబాద్‌ మెట్రో తిప్పలు.

Hyderabad Metro: ఎక్కేందుకు దారి లేదు.. నిల్చోడానికి చోటు లేదు.! హైదరాబాద్‌ మెట్రో తిప్పలు.

Anil kumar poka
|

Updated on: Feb 14, 2024 | 8:41 AM

Share

హైదరాబాద్‌ మెట్రో రైల్లో రద్దీ సమయాలలో ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కారిడార్‌-3 నాగోల్‌-రాయదుర్గం మార్గంలో ఇప్పుడున్న మెట్రో రైల్‌ కోచ్‌లు రద్దీ వేళల్లో సరిపోవడం లేదు. అమీర్‌పేట, మెట్టుగూడ స్టేషన్ల నుంచి లూప్‌ మెట్రోలు నడుపుతున్నా.. ఇవి పరిమితంగా ఉన్నాయి. ఉదయం అమీర్‌పేట నుంచి రాయదుర్గం వెళ్లేందుకు రద్దీతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.

హైదరాబాద్‌ మెట్రో రైల్లో రద్దీ సమయాలలో ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కారిడార్‌-3 నాగోల్‌-రాయదుర్గం మార్గంలో ఇప్పుడున్న మెట్రో రైల్‌ కోచ్‌లు రద్దీ వేళల్లో సరిపోవడం లేదు. అమీర్‌పేట, మెట్టుగూడ స్టేషన్ల నుంచి లూప్‌ మెట్రోలు నడుపుతున్నా.. ఇవి పరిమితంగా ఉన్నాయి. ఉదయం అమీర్‌పేట నుంచి రాయదుర్గం వెళ్లేందుకు రద్దీతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. సాయంత్రం రాయదుర్గం నుంచి నాగోల్‌ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటోంది. రద్దీ వేళల్లో మూడు నాలుగు నిమిషాలకు ఒక మెట్రో నడుపుతున్నా.. రాయదుర్గంలోనే మెట్రో కోచ్‌లన్నీ నిండిపోతున్నాయి. హైటెక్‌ సిటీలో కష్టంగా ఎక్కగలుగుతున్నారు. దుర్గంచెరువు స్టేషన్‌లో కాలు పెట్టేందుకు కూడా చోటు లేక మూడు నాలుగు మెట్రోలను వదిలేస్తున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పని చేయాలని కంపెనీలు కోరుతుండటంతో మెట్రోలో రద్దీ పెరిగింది. వేసవిలో చల్లని ప్రయాణం కోసం మరింత మంది మెట్రోని ఆశ్రయిస్తారు. దీంతో ఐదు లక్షలమందికి పైగా దాటి ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. అదనపు కోచ్‌లు లేకపోతే రద్దీని తట్టుకోవడం కష్టమే. ఉదయం, సాయంత్రం ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు అదనపు కోచ్‌లను లీజుకు తీసుకోవాలని గత ప్రభుత్వం ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోని ఆదేశించింది. నాగ్‌పూర్‌నుంచి 12 కోచ్‌లు తీసుకునేందుకు చర్చలు జరిపారు. తర్వాత ఈ ప్రక్రియకు ముందడుగు పడలేదు. మెట్రోలో ప్రస్తుతం 4.80 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. జేబీఎస్‌ నుంచి ఎంబీబీఎస్‌ కారిడార్‌-2లో 35 వేల మంది వరకు ప్రయాణిస్తుంటే.. మిగతా రెండు కారిడార్లలోనే మిగిలిన వారు ప్రయాణిస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం డిసెంబరు 9న ప్రారంభించాక.. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య 4 శాతం తగ్గింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..