‘మ్యావ్ మ్యావ్‌’ పట్టివేత.. ఆ డ్రగ్ మార్కెట్‌ విలువ రూ.2,200 కోట్లు !!

మహారాష్ట్ర, ఢిల్లీలో భారీగా మెఫెడ్రిన్‌ వ్యాపారం జరుగుతోంది. తాజాగా పోలీసులు ఈ రాకెట్‌పై దాడి చేసి ఏకంగా వేల కోట్ల విలువైన డ్రగ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. పుణే నగరం నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని షోలాపుర్‌ వద్ద కుర్‌కుంభ సమీపంలోని ఓ ఫార్మాస్యూటికల్‌ ప్లాంట్‌లో 700 కేజీల డ్రగ్‌ను సీజ్‌ చేశారు. మరో వైపు ఢిల్లీలోని హౌజా ఖాస్‌ ఏరియాలో దాడులు నిర్వహించి 400 కేజీలను పట్టుకొన్నారు. వీటి మొత్తం మార్కెట్‌ విలువ ఏకంగా 2,200 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.

‘మ్యావ్ మ్యావ్‌’ పట్టివేత.. ఆ డ్రగ్ మార్కెట్‌ విలువ రూ.2,200 కోట్లు !!

|

Updated on: Feb 24, 2024 | 12:15 PM

మహారాష్ట్ర, ఢిల్లీలో భారీగా మెఫెడ్రిన్‌ వ్యాపారం జరుగుతోంది. తాజాగా పోలీసులు ఈ రాకెట్‌పై దాడి చేసి ఏకంగా వేల కోట్ల విలువైన డ్రగ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. పుణే నగరం నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని షోలాపుర్‌ వద్ద కుర్‌కుంభ సమీపంలోని ఓ ఫార్మాస్యూటికల్‌ ప్లాంట్‌లో 700 కేజీల డ్రగ్‌ను సీజ్‌ చేశారు. మరో వైపు ఢిల్లీలోని హౌజా ఖాస్‌ ఏరియాలో దాడులు నిర్వహించి 400 కేజీలను పట్టుకొన్నారు. వీటి మొత్తం మార్కెట్‌ విలువ ఏకంగా 2,200 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఘటనపై అదనపు పోలీస్ కమిషనర్‌ శైలేష్‌ బాల్కవాడే మాట్లాడుతూ ఫార్మా ప్లాంట్‌ ఓనర్‌ను అరెస్టు చేశామనీ ఓ కెమికల్‌ ఇంజినీర్‌కు దీంతో సంబంధం ఉందని తెలిపారు. తమ బృందం ఢిల్లీ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ రాకెట్‌లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయుల హస్తం కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మహిళ 21 వేల కి.మీ.ల బుల్లెట్ యాత్ర.. ఎందుకో తెలుసా ??

హెలీక్యాప్టర్‌లో రామ్ చరణ్.. గూస్ బంప్స్‌ తెచ్చేలా ‘గేమ్‌ ఛేంజర్‌’ వీడియో..

అనిల్ రావిపూడి చేతుల్లో.. బాలయ్య కొడుకు ఫ్యూచర్ ??

Deepika Padukone: 500కోట్లకు పైగా సంపాదన.. స్టార్ హీరోలనే బెంబేలెత్తిస్తున్న దీపిక

ఉప్పు నిప్పు కలిసిన వేళ.. సౌండ్‌ అదిరిపోద్దిగా..

 

Follow us