దొంగోడే.. కానీ పోలీసులకే షాకయ్యే కథ చెప్పాడు..
ప్రతిరోజూ ఏదోక చోట, అనేక దొంగతనాలు వెలుగులోకి వస్తున్నాయి. తమకు మరో మార్గం లేక చోరీలకు పాల్పడుతున్నట్లు కొందరి దొంగల మాటల్లో విన్నాం. తాజాగా ఓ 20 ఏళ్ల విద్యార్థి మొబైల్ షాపు తాళం పగులగొట్టి, చోరీకి పాల్పడ్డ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో జరిగింది. లోపలికి ప్రవేశించి ఒకటి రెండు కాదు ఏకంగా 41 మొబైల్ ఫోన్లను అపహరించాడు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ చేసింది ఇంజినీరింగ్ విద్యార్థి అని తేలడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఇంజినీరింగ్ ఫీజు కట్టేందుకు దొంగతనం చేశానని పోలీసులకు చెప్పాడు. అయితే క్రైం బ్రాంచ్ పోలీసులు లోతుగా విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మెరుగైన జీవితం గడపాలని, కాలేజీలో డబ్బులు ఎక్కువగా ఖర్చుపెట్టాలన్న కోరికతో చోరీకి పాల్పడినట్లు తేలింది. చోరీకి పాల్పడ్డ వ్యక్తిని ఆకాష్ రాజారామ్ రాజ్కుండేగా గుర్తించారు. ఆకాష్.. నెతుల్లోని ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ఓ మొబైల్ షాపులో రూ.24 లక్షల విలువైన 41 మొబైల్ ఫోన్లను దొంగిలించాడు. దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆకాష్కు క్రైమ్ హిస్టరీ లేదని, అంటే ఇంతకు ముందు ఏ కేసులోనూ ప్రమేయం లేదని తేలింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెత్త సంచిలో రూ.5900 కోట్లు పడేసిన మహిళ.. చివరికి ??
ట్రంప్ ప్రైవేట్ జెట్.. లోపల ఎలా ఉంటుందో తెలుసా ??
రూ.40 వేల కోట్ల ఆస్తిని వదిలి బౌద్ధ సన్యాసిగా..
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

