హ్యారీపోటర్ క్రేజ్ ఇంకా తగ్గలేదు.. అధిక ధరకు అమ్ముడైన ఈ బుక్కే సాక్ష్యం !!
హ్యారీ పోటర్ బుక్ మొదటి ఎడిషన్ భారీ ధరకు అమ్ముడుపోయింది. స్టాఫోర్డ్షైర్లోని లిచ్ఫీల్డ్లో బుధవారం పుస్తక వేలం జరిగింది. ఈ వేలంలో అరుదైన మొదటి ఎడిషన్ హ్యారీ పోటర్ బుక్ ఏకంగా 36 వేల పౌండ్లకు అమ్ముడుపోయింది. అంటే భారత కరెన్సీలో రూ.38.50 లక్షలు. 30 ఏళ్ల క్రితం కేవలం 10 పౌండ్లకు కొనుగోలు చేసిన ఆ పుస్తకం తాజా వేలంలో ఏకంగా 36 వేల పౌండ్లకు అమ్ముడుపోయింది.
క్రిస్టీన్ మెక్కల్లోచ్ తన కుమారుడు ఆడమ్ కోసం 1997లో స్ట్రాట్ఫోర్డ్-అపాన్-అవాన్ పుస్తక దుకాణం నుంచి ఈ అరుదైన మొదటి ఎడిషన్ కాపీని కొనుగోలు చేశారు. హాన్సన్స్ ఆక్షనీర్స్ ప్రకారం 1997లో తొలిసారిగా బ్రిటిష్ రచయిత జేకే రౌలింగ్ రచించిన ఈ ఫస్ట్ ఎడిషన్ బుక్ను కేవలం 500 హార్డ్బ్యాక్ కాపీలు మాత్రమే ముద్రించారు. అందులో ఈ పుస్తకం ఒకటి. డెర్బీషైర్లోని టాన్స్లీకి చెందిన ఆడమ్ మెక్కల్లోచ్… ఈ కాపీని తన ఇంటి మెట్ల క్రింద ఉన్న అల్మారాలో భద్రపరిచారు. 2020 లాక్డౌన్ సమయంలో ఈ మొదటి ఎడిషన్ల విక్రయాల గురించి తెలిసింది. తాజాగా దానిని వేలానికి పెట్టడంతో ఓ బిడ్డర్ 36వేల పౌండ్లు చెల్లించి కొనుగోలు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగోడే.. కానీ పోలీసులకే షాకయ్యే కథ చెప్పాడు..
చెత్త సంచిలో రూ.5900 కోట్లు పడేసిన మహిళ.. చివరికి ??
ట్రంప్ ప్రైవేట్ జెట్.. లోపల ఎలా ఉంటుందో తెలుసా ??
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

