భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
అరేబియా సముద్రంలో ఓ నౌక మునిగి పోగా.. అందులోని తొమ్మిది మంది భారతీయ సిబ్బందిని కోస్ట్గార్డ్ సురక్షితంగా కాపాడింది. పాకిస్థాన్ సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తిచేసినట్లు వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్లోని ముంద్రా నుంచి యెమెన్లోని సొకొత్రా ద్వీపానికి ఓ నౌక బయల్దేరింది.
మార్గమధ్యంలో పశ్చిమ అరేబియా సముద్రంలో భీకర అలల తాకిడికి నౌక ప్రమాదానికి గురైంది. గుజరాత్లోని పోరుబందర్కు సుమారు 311 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమను కాపాడాలంటూ అందులోని తొమ్మిది మంది సిబ్బంది అత్యవసర సందేశం పంపారు. రోజువారీ నిఘా కార్యకలాపాల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న ‘ఐసీజీ డోర్నియర్’ దీన్ని గుర్తించి.. గాంధీనగర్లోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, ముంబయిలోని ‘ఎంఆర్సీసీ’లను అప్రమత్తం చేసింది.
ఈ క్రమంలోనే ఘటనాస్థలానికి సమీపంలో పెట్రోలింగ్లో ఉన్న ఐసీజీ నౌక ‘శూర్’ వెంటనే రంగంలోకి దిగి.. విపత్కర వాతావరణ పరిస్థితుల నడుమ ఆ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. రెస్క్యూ ఆపరేషన్లో పాకిస్థాన్ అధికారులతో సమన్వయం చేసుకున్నట్లు కోస్ట్గార్డ్ తెలిపింది. సిబ్బందికి వైద్య సాయం అందించామని, వారిని పోరుబందర్కు తరలిస్తున్నట్లు పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

