AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuwait Fire: కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు.

Kuwait Fire: కువైట్ మృతుల కుటుంబాలకు 7 లక్షల సాయం.. మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు.

Anil kumar poka

|

Updated on: Jun 15, 2024 | 8:54 PM

కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళ చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. మృతుల్లో 23 మంది కేరళ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో మృతదేహాలతో విమానం ముందుగా కేరళ చేరుకుంది.

కువైట్‌లోని ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం కేరళ చేరుకుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. మృతుల్లో 23 మంది కేరళ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో మృతదేహాలతో విమానం ముందుగా కేరళ చేరుకుంది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ విచ్చేసిన కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంబులెన్స్‌లు, పోలీసు బలగాలు మోహరించాయి. ఈ విమానం మళ్లీ కేరళ నుంచి ఢిల్లీకి వెళ్లనుంది.

కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురున్నట్లు ఏపీ నాన్‌రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం , తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో స్పందించిన భారత రాయబార కార్యాలయం అధికారులు గురువారం కువైట్ అగ్నిప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారిని కలిశారు. కీర్తి వర్ధన్ సింగ్ గల్ఫ్ దేశ విదేశాంగ మంత్రి, ఆరోగ్య మంత్రులను విడివిడిగా కలిశారు. దీంతోపాటు కీర్తి వర్ధన్ సింగ్ ముబారక్ అల్ కబీర్ హాస్పిటల్, జాబర్ హాస్పిటల్‌లను కూడా సందర్శించారు. అక్కడ అనేక మంది గాయపడిన భారతీయులు ఉన్నారు. వ్యాపారవేత్తలైన లులు గ్రూప్‌ అధినేత యూసుఫ్‌ అలీ రూ.5 లక్షల చొప్పున, రవి పిళ్లై రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.