AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు మామూలోడు కాదు.. లండన్ నుంచి హైదరాబాద్‌లోని భార్యపై విషప్రయోగం

వీడు మామూలోడు కాదు.. లండన్ నుంచి హైదరాబాద్‌లోని భార్యపై విషప్రయోగం

Phani CH
|

Updated on: Aug 22, 2023 | 9:47 AM

Share

నేరగాళ్లు తెలివికే తెలివి మీరి పోతున్నారు. తనతో విడిపోయిన భార్య కుటుంబాన్ని అంతమొందించడానికి ఓ ఎన్నారై లండన్ నుంచి విషప్రయోగం చేశాడు. విషయం బయటపడడానికి ముందే అతని అత్త ప్రాణాలు కోల్పోయింది. సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌కు చెందిన డాక్టర్ శిరీషకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎం. అజిత్‌కుమార్‌తో వివాహమైంది. ఆ తర్వాత వారు లండన్‌లో స్థిరపడ్డారు.

నేరగాళ్లు తెలివికే తెలివి మీరి పోతున్నారు. తనతో విడిపోయిన భార్య కుటుంబాన్ని అంతమొందించడానికి ఓ ఎన్నారై లండన్ నుంచి విషప్రయోగం చేశాడు. విషయం బయటపడడానికి ముందే అతని అత్త ప్రాణాలు కోల్పోయింది. సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌కు చెందిన డాక్టర్ శిరీషకు 2018లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎం. అజిత్‌కుమార్‌తో వివాహమైంది. ఆ తర్వాత వారు లండన్‌లో స్థిరపడ్డారు. కుమార్తె జన్మించిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో శిరీష లండన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి వారు విడివిడిగానే ఉంటున్నారు. దీంతో అజిత్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. కొన్ని నెలల కిందట శిరీష తన తమ్ముడి పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చింది. మియాపూర్ గోకుల్ ఫ్లాట్స్‌లో తల్లిదండ్రులతో కలసి ఉంటోంది. ఇదే అదనుగా శిరీషను, ఆమె కుటుంబ సభ్యులను చంపడానికి అజిత్ పథకం పన్నాడు. లండన్‌లో తన దగ్గర పనిచేసే వినోద్‌కుమార్‌తో కలసి స్కెచ్ వేశాడు. హైదరాబాద్‌లోని వారి మిత్రులైన భవానీశంకర్‌, అశోక్‌, గోపినాథ్‌, శిరీష దగ్గరి బంధువైన పూర్ణానందరావు చేతులు కలిపారు. శిరీష కుటుంబం నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వాచ్‌మన్‌ కొడుకు రమేష్‌కు డబ్బులిచ్చి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించసాగారు. ప్లాన్ అమల్లో భాగంగా జూన్ 25న తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు విషపు ఇంజక్షన్లు తీసుకుని శిరీష తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అది పిల్లికాదుబ్రో చిరుత.. సెల్ఫీ తర్వాత.. లగెత్తు

హవ్వ.. ఇదేం పని ?? దైవదర్శనానికి వెళ్లి దేవుడికే శఠగోపం పెట్టాడు !!

ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం

వామ్మో రాక్షసగూళ్లు.. వాటిలో ఏం దొరికాయో తెలుసా ??

శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..