AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..

శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..

Phani CH

|

Updated on: Aug 22, 2023 | 9:40 AM

కర్నాటక రాష్ట్రం ధార్వాడ జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. చికిత్స పొందుతున్న 8 నెలల చిన్నారి చనిపోయాడని వైద్యులు భావించి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు మున్నీరైన దంపతులు చిన్నారిని శ్మశానానికి తీసుకెళ్లగా కదలికలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా 90 శాతం నాడి కొట్టుకుంటోందని వైద్యులు గుర్తించి చికిత్స ప్రారంభించారు. నవలగుంద తాలూకా బసాపుర గ్రామానికి చెందిన బసప్ప పూజార్‌ కుమారుడిని ఊపిరి సరిగా ఆడకపోవడంతో హుబ్లీ కిమ్స్‌లో చేర్పించారు.

కర్నాటక రాష్ట్రం ధార్వాడ జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. చికిత్స పొందుతున్న 8 నెలల చిన్నారి చనిపోయాడని వైద్యులు భావించి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు మున్నీరైన దంపతులు చిన్నారిని శ్మశానానికి తీసుకెళ్లగా కదలికలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా 90 శాతం నాడి కొట్టుకుంటోందని వైద్యులు గుర్తించి చికిత్స ప్రారంభించారు. నవలగుంద తాలూకా బసాపుర గ్రామానికి చెందిన బసప్ప పూజార్‌ కుమారుడిని ఊపిరి సరిగా ఆడకపోవడంతో హుబ్లీ కిమ్స్‌లో చేర్పించారు.నాలుగు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు గురువారం సాయంత్రం.. పల్స్‌రేట్‌ తక్కువగా ఉందని, ఆక్సిజన్‌ తొలగిస్తే బిడ్డ బతకదని తెలిపారు. అనంతరం చిన్నారి చనిపోయాడని చెప్పి తల్లిదండ్రులతో సంతకం తీసుకొని శిశువును అప్పగించారు. శ్మశానానికి తీసుకెళ్లి ఆచారం ప్రకారం నోట్లో పసుపు నీరు పోస్తుండగా బాలుడు ఆశ్చర్యకరంగా చేతులు, కాళ్లను ఆడించాడు. తక్షణమే ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొసళ్ల మధ్యనుంచి దూసుకెళ్తోన్న బోటు !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

Saif Ali Khan: ఆదిపురుష్ రావణుడి ఆస్తులెంతో తెలుసా ??

వర్షాలకు కొట్టుకొస్తున్న బంగారు నాణేలు !! అక్కడ బంగారు లంకె బిందెలు ఉన్నాయా ??

300 ఫోటోలు 30 దేశాల జెండాలను గుర్తిస్తున్న చిన్నారి !!

బైక్‌ హ్యాండిల్‌ వదిలేసి వృద్ధుడి స్టంట్లు !! చూస్తే షాక్‌ అవ్వాల్సిందే