Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యపై అనుమానంతో పెట్రోల్‌ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

భార్యపై అనుమానంతో పెట్రోల్‌ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం

Samatha J

|

Updated on: Feb 14, 2025 | 8:44 PM

భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య పనిచేసే షాపులో ఒంటిపై పెట్రోల్​ పోసుకొని, నిప్పంటించుకోగా 98 శాతం గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడి కండిషన్ సీరియస్ ​గా ఉంది. ఈ ఘటన ఆదివారం సికింద్రాబాద్​లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. శ్రావణ్ భార్య సికింద్రాబాద్​ లోని ఓ క్లాత్​ షోరూమ్​ లో జాబ్​ చేస్తోంది. అయితే, ఆమె పై అనుమానం పెంచుకున్న శ్రావణ్..​ ఆదివారం మధ్యాహ్నం షాప్ కు వెళ్లి గొడవపడ్డాడు.

తిరిగి సాయంత్రం షాప్ కు పెట్రోల్​ బాటిల్ తో వెళ్లాడు. కస్టమర్లు ఉన్న సమయంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకున్నాడు. దీంతో షాక్​ తిన్న కస్టమర్లు దుకాణం నుంచి పరుగులు తీశారు. అది క్లాత్ షోరూమ్ కావడంతో అక్కడ ఉన్న బట్టలకు మంటలు అంటుకున్నాయి. ఫైర్​ సిబ్బందికి సమాచారం అందడంతో.. వారు వెంటనే అక్కడికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్ ను వెంటనే అంబులెన్స్ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో అతడికి అత్యవసర ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. దాదాపు 98 శాతం శరీరం కాలిపోయినట్టు క్యాజువాలిటీ మెడికల్ ​ఆఫీసర్​ తెలిపారు. శ్రావణ్​ పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

స్పీడ్ బోటులో షికారు చేస్తున్న పర్యాటకులు..నది మధ్యలోకి వెళ్లగానే..

భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే ఊహించని షాక్ వీడియో

అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో

ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు…

భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. వీడియో