గుడి ఆవరణలో కనిపించిన ఈ రాయి.. పెద్ద గుట్టు విప్పింది వీడియో
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయునిపల్లి గ్రామంలో వెలసిన వీరాంజనేయస్వామి దేవాలయంలో పురాతన తెలుగు శాసనం వెలుగుచూసింది. ఇటీవల గుడి మరమ్మత్తు పనులు చేస్తుండగా.. కొమరోలు ఆవిర్భావానికి సంబంధించిన శాసనాన్ని గుర్తించారు. ఐదువందల ఏళ్ల క్రితం కొమరవెల్లిగా పిలుచుకునే పట్టణమే నేడు కొమరోలుగా మారిందని తెలుస్తోంది. ఈ విషయాలను తెలియచేసే 15వ శతాబ్దానికి చెందిన శిలాశాసనం ఆలయ ఆవరణలో లభ్యమైంది.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హనుమంతరాయుని పల్లి సమీపంలోని ప్రాచీన దేవాలయంలో 15వ శతాబ్దం నాటి శిలా శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శిలా శాసనాల ఆధారంగా శ్రీరాముడు, సీతాదేవి అరణ్యవాసం చేసేటప్పుడు కొద్ది రోజులపాటు ఈ ఆలయ ప్రాంగణంలో విడిది చేసినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. సీతమ్మవారు స్నానమాచరించేందుకు రాములవారు ఆలయ సమీపంలో ఒక బావిని తవ్వించారని ఆ బావికి సీతమ్మ బావిగా నామకరణం చేశారని పేర్కొన్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సీతమ్మ వారి పాదాలు ముద్రలు కూడా ఉన్నాయని, ఆలయంలో అమ్మవారు, వినాయకుడు, హనుమంతుడు, వీరభద్రుడు, నాగేంద్రుడు విగ్రహాలు 15వ శతాబ్దం నాటివని అర్చకులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

