AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

Samatha J
|

Updated on: Nov 13, 2025 | 12:33 PM

Share

అనకాపల్లిలో రూ.16 లక్షల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు లాటరీ పేరుతో ఓటీపీ అడిగి బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. వాడుకలో లేని ఖాతాలతో పాటు, కొందరు బ్యాంకు సిబ్బంది సహకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. విశాఖ, తెలంగాణలో అరెస్టులు జరిగాయి. మీ ఖాతా భద్రతకు అప్రమత్తంగా ఉండాలి.

అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి నేరగాళ్లు విడతల వారీగా 16 లక్షల రూపాయలు దోచేసిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తులో నగదు విదేశీ కరెన్సీగా మార్చబడినట్లు తేలింది. సైబర్ నేరగాళ్లు తమ మోసపూరిత పద్ధతులలో కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ముందుగా కొన్ని ఖాతాల్లో రూ.10,000 నుంచి రూ.20,000 వరకు జమ చేస్తారు. అనంతరం బాధితులకు ఫోన్ చేసి, లాటరీ తగిలిందని, మీ ఖాతాలో నగదు జమ చేశామని నమ్మిస్తారు. అటుపై ఓటీపీ చెప్పమని కోరుతారు. నేరగాళ్ల మాటలు విని ఓటీపీ చెప్పినట్లయితే, మీ బ్యాంక్ ఖాతాకు నేరగాళ్లు పూర్తి యాక్సెస్ పొందుతారు.

మరిన్ని వీడియోల కోసం :

పట్ట పగలే దారుణం.. కళ్లల్లో కారం కొట్టి వీడియో

భద్రాద్రిలో జై శ్రీరామ్ ఇటుకలు.. వీడియో వైరల్