మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
అనకాపల్లిలో రూ.16 లక్షల సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు లాటరీ పేరుతో ఓటీపీ అడిగి బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. వాడుకలో లేని ఖాతాలతో పాటు, కొందరు బ్యాంకు సిబ్బంది సహకరిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. విశాఖ, తెలంగాణలో అరెస్టులు జరిగాయి. మీ ఖాతా భద్రతకు అప్రమత్తంగా ఉండాలి.
అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి నేరగాళ్లు విడతల వారీగా 16 లక్షల రూపాయలు దోచేసిన ఘటన సంచలనం సృష్టించింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తులో నగదు విదేశీ కరెన్సీగా మార్చబడినట్లు తేలింది. సైబర్ నేరగాళ్లు తమ మోసపూరిత పద్ధతులలో కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ముందుగా కొన్ని ఖాతాల్లో రూ.10,000 నుంచి రూ.20,000 వరకు జమ చేస్తారు. అనంతరం బాధితులకు ఫోన్ చేసి, లాటరీ తగిలిందని, మీ ఖాతాలో నగదు జమ చేశామని నమ్మిస్తారు. అటుపై ఓటీపీ చెప్పమని కోరుతారు. నేరగాళ్ల మాటలు విని ఓటీపీ చెప్పినట్లయితే, మీ బ్యాంక్ ఖాతాకు నేరగాళ్లు పూర్తి యాక్సెస్ పొందుతారు.
మరిన్ని వీడియోల కోసం :
Follow Us
వైరల్ వీడియోలు
ప్రియురాలికి ప్రపోజ్ చేయబోతే రింగ్ జారిపడింది.. చివరకు..
మంచు గుప్పిట్లో ఉత్తర కాశ్మీర్..
ధ్వజస్తంభంపై చిలుక..ఎగిరిపోయిందో.. ప్రళయమే!
సర్పంచ్ ఇంట్లో వింత శబ్ధాలు.. వెళ్లిచూడగా షాకైన కుటుంబం
రీల్స్ సరదా.. నిండు ప్రాణం బలి
అర్ధరాత్రి పంటచేలో మంటలు.. ఏం జరిగిందంటే
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

