టాయిలెట్లో ఇరుక్కున్న బాలిక కాలు.. చివరికి ??
కదులుతున్న ఎక్స్ప్రెస్ రైలు టాయిలెట్లో నాలుగేళ్ల బాలిక కాలు ఇరుక్కుపోయింది. ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో ఆగస్ట్ 15న ఈ ఘటన జరిగింది. బిహార్లోని సీతామడికి చెందిన మహ్మద్ అలీ.. తన భార్య, కుమార్తెతో కలిసి ఆగ్రా ఫోర్ట్ స్టేషన్లో అవధ్ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీ బి-6 ఎక్కారు. అనంతరం కుమార్తెను టాయిలెట్కు తీసుకెళ్లారు. అక్కడ రైలు వేగానికి బోగీ కదలడంతో పాప కాలు ఇండియన్ టాయిలెట్ బేసిన్లో ఇరుక్కుపోయింది. ముందు తల్లి, ఆ తర్వాత కొందరు ప్రయాణికులు ప్రయత్నించినా బయటకు తీయడం సాధ్యంకాలేదు.
కదులుతున్న ఎక్స్ప్రెస్ రైలు టాయిలెట్లో నాలుగేళ్ల బాలిక కాలు ఇరుక్కుపోయింది. ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో ఆగస్ట్ 15న ఈ ఘటన జరిగింది. బిహార్లోని సీతామడికి చెందిన మహ్మద్ అలీ.. తన భార్య, కుమార్తెతో కలిసి ఆగ్రా ఫోర్ట్ స్టేషన్లో అవధ్ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీ బి-6 ఎక్కారు. అనంతరం కుమార్తెను టాయిలెట్కు తీసుకెళ్లారు. అక్కడ రైలు వేగానికి బోగీ కదలడంతో పాప కాలు ఇండియన్ టాయిలెట్ బేసిన్లో ఇరుక్కుపోయింది. ముందు తల్లి, ఆ తర్వాత కొందరు ప్రయాణికులు ప్రయత్నించినా బయటకు తీయడం సాధ్యంకాలేదు. రైలు 20 కిలోమీటర్ల దూరంలోని ఫతేపుర్ సిక్రీ చేరుకుంది. అక్కడి అధికారులూ కాలు బయటకు తీయలేకపోయారు. చివరకు ఆగ్రా నుంచి నిపుణులు వచ్చి బయో టాయిలెట్ బాక్స్ను విడదీసి చిన్నారి కాలును బయటకు తీశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
500 మీటర్ల దూరం కారు బానెట్పై యువతిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !!
ఫ్రెండ్స్పైనే పెప్పర్ స్ప్రే … ట్రై చేసిన అమ్మాయిల సస్పెన్షన్
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

