మెదక్ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న చిరుత వీడియో
మెదక్ జిల్లా రైతును చిరుత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 1421, జాతీయ రహదారి పక్కన చిరుత పులి సంచారంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం శివారు ప్రాంతంలోని కెసిఆర్ కాలనీ సమీపంలోని కళాశాల స్వామి అనే రైతు పొలం వద్ద చిరుత సంచరిస్తూ పశువులపై దాడికి పాల్పడింది. లేగదూడను చంపి తినేసింది. గత శనివారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకపై దాడి చేసిన చిరుత పులి ఒక లేగ దూడను చంపి తినేసింది
ఉదయం పొలం వద్దకు వెళ్లి గమనించిన రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడి పరిస్థిని పరిశీలించారు. బుధవారం రాత్రి అదే ప్రాంతంలో గొలిపర్తి గ్రామానికి చెందిన పేరని లింగం వ్యవసాయ పొలం వద్ద మరోసారి చిరుత సంచరిస్తూ పశువుల పాక వద్ద కాపలాగా ఉంచిన కుక్కపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. ఉదయం పొలానికి వచ్చిన రైతు చుక్క చనిపోవడం గమనించి చిరుత దాడి చేసిందని నిర్ధారించుకొని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
మరిన్ని వీడియోల కోసం :
అవి ఖర్జూర పండ్లా.. బంగారు పండ్లా? వీడియో
అమెరికాలో కోమాలో భారతీయ విద్యార్థిని..తండ్రికి వీసా పై సందిగ్ధత ?వీడియో
ఈ చెప్పులు ఎత్తుకెళ్లాలంటే కష్టమే.. ఎందుకంటే? వీడియో
అంగారక గ్రహంపై పెద్ద సముద్రం.. ఆశ్చర్యపరుస్తున్న తాజా పరిశోధన వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు
ఆ రంగంలో మహిళలకే ఎక్కువ జీతాలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.

