జీతం పెంచని యజమాని.. ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్
మధ్యప్రదేశ్లో షాపింగ్ మాల్ ఉద్యోగి తన యజమానిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. మాల్లోని వస్తువులను ధ్వంసం చేసి భారీ నష్టం కలిగించాడు. సుమారు రూ.18 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉద్యోగి పగలగొట్టాడు. నిందితుడు కమల్ పవార్ షాపింగ్ మాల్లోని ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉంచిన వస్తువులను ధ్వంసం చేశాడు. 11 టీవీ స్క్రీన్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగలగొట్టాడు.
దాని తరువాత, అతను రిఫ్రిజిరేటర్ విభాగానికి వెళ్లి 71 రిఫ్రిజిరేటర్లను పనికి రాకుండా చేశాడు. అయితే ఈ పనిని బయటి వ్యక్తి చేయలేదని, మాల్ స్వంత ఉద్యోగే చేశారని అనుమానించిన యాజమాని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. మాల్ ఉద్యోగి కమల్ పవార్ దీపావళికి ముందు తన మాల్ ఆపరేటర్ నుండి జీతం పెంచాలని డిమాండ్ చేశాడు. కానీ అతని డిమాండ్ నెరవేరకపోవడంతో, అదే కోపంలో మూడు రోజులు సెలవు తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత మాల్లో ఇలా చేశాడు. ఈ ఘటనపై మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాల్లోని వస్తువులను పాడు చేశారనే ఆరోపణలతో సదరు ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికీ నిందితుడి మానసిక పరిస్థితిని సాకుగా చూపి బెయిల్ పొందాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: ప్రభాస్ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!
ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్
TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

