జీతం పెంచని యజమాని.. ఉద్యోగి చేసిన పనికి అంతా షాక్
మధ్యప్రదేశ్లో షాపింగ్ మాల్ ఉద్యోగి తన యజమానిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. మాల్లోని వస్తువులను ధ్వంసం చేసి భారీ నష్టం కలిగించాడు. సుమారు రూ.18 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉద్యోగి పగలగొట్టాడు. నిందితుడు కమల్ పవార్ షాపింగ్ మాల్లోని ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉంచిన వస్తువులను ధ్వంసం చేశాడు. 11 టీవీ స్క్రీన్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగలగొట్టాడు.
దాని తరువాత, అతను రిఫ్రిజిరేటర్ విభాగానికి వెళ్లి 71 రిఫ్రిజిరేటర్లను పనికి రాకుండా చేశాడు. అయితే ఈ పనిని బయటి వ్యక్తి చేయలేదని, మాల్ స్వంత ఉద్యోగే చేశారని అనుమానించిన యాజమాని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంతో అసలు వ్యవహారం బయటపడింది. మాల్ ఉద్యోగి కమల్ పవార్ దీపావళికి ముందు తన మాల్ ఆపరేటర్ నుండి జీతం పెంచాలని డిమాండ్ చేశాడు. కానీ అతని డిమాండ్ నెరవేరకపోవడంతో, అదే కోపంలో మూడు రోజులు సెలవు తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత మాల్లో ఇలా చేశాడు. ఈ ఘటనపై మాల్ మేనేజర్ సంజయ్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాల్లోని వస్తువులను పాడు చేశారనే ఆరోపణలతో సదరు ఉద్యోగిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికీ నిందితుడి మానసిక పరిస్థితిని సాకుగా చూపి బెయిల్ పొందాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Trisha: ప్రభాస్ సినిమా వల్ల తీవ్ర ఇబ్బంది పడ్డా !! షాకిచ్చిన త్రిష !!
ఈ హీరో వసూళ్లతో.. మునిగిపోతున్న బాలీవుడ్ !! టెన్షన్ లో ప్రొడ్యూసర్స్
TOP 9 ET News: తన ప్రేమకథను బయటపెట్టిన చై
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

