AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!

దురదగా ఉందని ఆస్పత్రికి వెళ్తే.. ఏకంగా ప్రాణమే పోయింది !!

Phani CH
|

Updated on: Oct 03, 2024 | 9:23 PM

Share

ఇటీవల భారీవర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చాలామంది నిరాశ్రయులయ్యారు. చుట్టూ వరద ముంపుతో ఎటూ పోలేని పరిస్థితిలో రోజుల తరబడి ఆ వరద నీటిలో నానిపోతూ కాలం వెల్లదీశారు. అదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. వర్షాలు, వరదలు తగ్గడంతో ఆ కుటుంబాలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. కానీ ఆ బాధ మాత్రం వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది.

ఇటీవల భారీవర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో చాలామంది నిరాశ్రయులయ్యారు. చుట్టూ వరద ముంపుతో ఎటూ పోలేని పరిస్థితిలో రోజుల తరబడి ఆ వరద నీటిలో నానిపోతూ కాలం వెల్లదీశారు. అదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. వర్షాలు, వరదలు తగ్గడంతో ఆ కుటుంబాలు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. కానీ ఆ బాధ మాత్రం వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. నాడు వరదనీటిలో నానిపోయిన బాధితులు ప్రమాదకర బ్యాక్టీరియా బారిన పడి నానాపాట్లూ పడుతున్నారు. విజయవాడలో ఈమధ్యే పన్నెండేళ్ల బాలుడు.. కండరాలను తినేసే బ్యాక్టీరియా బారిన పడి తొడవరకూ కాలును కోల్పోయాడు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి గుంటూరులో చోటు చేసుకుంది. 81 ఏళ్ల వ్యక్తి ప్రాణాంతక బ్యాక్టీరియా కారణంగా ఇన్‌ఫెక్షన్‌ సోకి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. గుంటూరు జిల్లా నెహ్రూనగర్‌కు చెందిన నారాయణ అనే 81 ఏళ్ల వ్యక్తికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారందరికీ వివాహాలు చేసి పంపించాడు. సోడా బండి నడుపుతూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నారాయణ ఇంటిలోకి నీరు చేరింది. ఇందులో డ్రెనేజీ వాటర్ కూడా కలిసింది. ఎప్పటిలాగే నారాయణ అదే ఇంట్లో ఎత్తు మంచం వేసుకొని బల్లపై ఇతర వస్తువులు ఉంచుకుని నీటిలో కాలం వెళ్లదీశాడు. కుటుంబ సభ్యులంతా ఇది మామూలే అని లైట్‌ తీసుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ??

రీల్స్‌ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే !!

ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా

కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి

గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు