వీళ్లు మామూలు దొంగలు కాదు.. దుకాణంలో ఏం చేశారో చూడండి !!
చోరీ చెయ్యాలనుకున్నప్పుడు పగలేంటి? రాత్రేంటి? రంగంలోకి దిగామా.. టార్గెట్ పూర్తి చేశామా లేదా అన్నదే ముఖ్యం. ఈ టాస్క్ని పర్ఫెక్ట్గా పూర్తిచేశారు కొందరు దొంగలు. అవును. ఆదిలాబాద్ జిల్లాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. బేల మండల కేంద్రంలో ఉన్న ఓ మార్ట్లో అందరూ చూస్తుండగానే ఎంతో చాకచక్యంగా లక్షల నగదు ఎత్తుకెళ్లిపోయారు.
ఈ చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కౌంటర్లో టేబుల్పైన డబ్బుతో ఉన్న సంచిని చోరీ చేసిన ఇద్దరు యువకులు క్షణాల్లో పారిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని బేల మండలంలో ఉన్న ఓ మార్ట్ కస్టమర్స్తో కోలాహలంగా ఉంది. కస్టమర్స్ ఎవరికి కావలసినవి వారు కొనుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి డబ్బు ఉన్న సంచిని తీసుకొచ్చి కౌంటర్లో ఉన్న వ్యక్తికి ఇచ్చాడు. అతను ఆ సంచి తీసుకొని తన టేబుల్ పైన పెట్టి అందులో కొంత నగదు తీసి లెక్కపెట్టి, సంచిని అక్కడే టేబుల్పైన వదిలేసి ఎవరికో ఇచ్చేందుకు మరో టేబుల్ దగ్గరకి వెళ్లాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
50% తక్కువ ధరకే రైల్వే టిక్కెట్లా ?? రైల్వే మంత్రి మాటల్లో వాస్తవమేంటి ??
పేరెంట్స్ని పెళ్లి రోజే ఖతం చేసి.. కథలు అల్లాడు
ఓటీటీలు ప్రతీనెల డబ్బులు కట్ చేస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి !!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

