AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌లో పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు ఇలాంటి లక్షణాలుంటే జాగ్రత్త..

సమ్మర్‌లో పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు ఇలాంటి లక్షణాలుంటే జాగ్రత్త..

Samatha J

|

Updated on: May 06, 2025 | 5:42 PM

మే వచ్చేసింది.. ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి.. ఓ వైపు ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి.. మరోవైపు తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. అదే స‌మ‌యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ సీజ‌న్‌లో కిడ్నీల‌లో రాళ్లు ఏర్పడే కేసులు రెండు నుంచి రెండున్నర రెట్లు పెరిగాయ‌ని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ త‌న నివేదిక‌లో తెలిపింది. డీహైడ్రేష‌న్‌, ఆహార‌పు అల‌వాట్లు స‌రిగా లేక‌పోవ‌డం, విప‌రీతంగా ఎండ‌ల్లో తిర‌గ‌డం వ‌ల్ల రోజుకు సుమారు 300 నుంచి 400 మంది రోగులు కిడ్నీలో రాళ్ల స‌మ‌స్యతో రావ‌డంతో వారికి ఏఐఎన్‌యూల చికిత్స చేస్తున్నారని వైద్యులు తెలిపారు.

వాస్తవానికి వైద్యులు.. వేస‌విని “స్టోన్ సీజ‌న్” అంటారు. ఈ కాలంలో ముఖ్యంగా కిడ్నీల‌కు చాలా ప్రమాదం ఉంటుంది. ప్రధానంగా.. శ‌రీరంలో నీరు ఆవిరి అయిపోవ‌డం, ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం, త‌గినంత నీరు తీసుకోక‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల వేస‌విలో కిడ్నీల‌లో రాళ్లు ఎక్కువ‌గా ఏర్పడ‌తాయి. ఏఐఎన్‌యూకు రోజుకు స‌గ‌టున 300 నుండి 400 కిడ్నీలో రాళ్ల కేసులు వ‌స్తున్నాయి. ఇటీవ‌లి కాలంలో ఇది బాగా ఎక్కువ‌. రాష్ట్ర వ్యాప్తంగా శీతాకాలంతో పోలిస్తే ఈ బాధితుల సంఖ్య రెట్టింపు దాటిపోయింది. దీనికి కారణం జంక్ ఫుడ్ తిన‌డం, ఎక్కువ‌గా క‌ద‌ల‌క‌పోవ‌డం, త‌గినంత నీరు తాగ‌క‌పోవ‌డం.. ఈ సమస్య పిల్లలు, యువ‌త‌లో ఎక్కువ‌వుతోంది. 10-17 సంవ‌త్సరాల మ‌ధ్య పిల్లల్ల రాళ్లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. పాఠ‌శాల‌లో ఉన్నప్పుడు నీళ్లు తాగ‌క‌పోవ‌డం, స్నాక్స్ ప్యాకెట్లు కొని తిన‌డం, కూల్ డ్రింకులు తాగడం దీనికి కార‌ణమని వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :