Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..70 మంది రక్తదానం

పెళ్లిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..70 మంది రక్తదానం

Phani CH

|

Updated on: Jan 25, 2024 | 9:48 PM

సాధారణంగా పెళ్లి వేడుకలు అంటే బంధుమిత్రులను పిలిచి విందుతో కోలాహలంగా జరుపుకుంటారు. జీవితాంతం గుర్తుండిపోయేలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ గ్రాండ్​గా వివాహం చేసుకుంటారు. అయితే బిహార్‌​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి రోజున వినూత్నమైన పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఔరంగాబాద్​ జిల్లాలోని హస్​పురా గ్రామానికి చెందిన అనీశ్ కేశరి, ఆరా ప్రాంతానికి చెందిన సిమ్రాన్‌ ​ కేశరి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.

సాధారణంగా పెళ్లి వేడుకలు అంటే బంధుమిత్రులను పిలిచి విందుతో కోలాహలంగా జరుపుకుంటారు. జీవితాంతం గుర్తుండిపోయేలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ గ్రాండ్​గా వివాహం చేసుకుంటారు. అయితే బిహార్‌​కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి రోజున వినూత్నమైన పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఔరంగాబాద్​ జిల్లాలోని హస్​పురా గ్రామానికి చెందిన అనీశ్ కేశరి, ఆరా ప్రాంతానికి చెందిన సిమ్రాన్‌ ​ కేశరి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే వరుడు అనీశ్​ తన పెళ్లి రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్​ను ఏర్పాటు చేయాలని వధువు కుటుంబాన్ని అడిగాడు. అతడు కోరినట్టే వివాహం రోజున మండపం దగ్గరే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వధువు కుటుంబీకులు. వధూవరులతో పాటు పెళ్లికి హజరైన వారితో కలిపి 70 మంది వరకు రక్తదానం చేశారు. పెళ్లి రోజున చేసిన రక్తదానం తనకు 14వ సారి అని అనీశ్ తెలిపాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు ఇళ్లలో 8 మృతదేహాలు.. ఆరాతీయగా షాక్

సాధన రూటే సెపరేటు.. పాటలతో పాఠాలు చెబుతున్న టీచర్

అయోధ్య రాముణ్ణి చూసేందుకు ఆంజనేయుడు వచ్చాడా?

చెట్టు నుంచి ఉబికి వస్తున్న పాలు.. వింత ఘటన ఎక్కడో తెలుసా ??

భారీ డేటా లీక్‌.. చరిత్రలో ఇదే అతి పెద్ద ఘటన