ప్రేమంటే ఇదేరా .. ఏకంగా ఈదుకుంటూ దేశ సరిహద్దునే దాటిన యువతి

ప్రేమ ఎల్లలు దాటుతుందని మరోసారి నిరూపితమైంది. సోషల్ మీడియాలో యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ప్రియుడ్ని వివాహం చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్న ఓ యువతి దుస్సాహసమే చేసింది.

ప్రేమంటే ఇదేరా .. ఏకంగా ఈదుకుంటూ దేశ సరిహద్దునే దాటిన యువతి

|

Updated on: Jun 08, 2022 | 9:26 AM

ప్రేమ ఎల్లలు దాటుతుందని మరోసారి నిరూపితమైంది. సోషల్ మీడియాలో యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో ప్రియుడ్ని వివాహం చేసుకోవాలని బలంగా నిర్ణయించుకున్న ఓ యువతి దుస్సాహసమే చేసింది. పొరుగు దేశంలో ఉన్న తన ప్రియుడు కోసం పులులకు ప్రసిద్ది చెందిన అడవుల గుండా ఒంటరిగా ప్రయాణించి, నదిని ఈదుకుంటూ గమ్యానికి చేరుకుంది. ఈ ఘటన భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువతి భారత్‌కు చెందిన తన ప్రియుడిని పెళ్లాడేందుకు సరిహద్దులు దాటింది. ఆమె సుందర్‌బన్స్‌లోని అడవులను ధైర్యంగా ఎదుర్కొని, ఒక గంట పాటు ఈదుకుంటూ తన జీవితపు ప్రేమతో ఏకం చేయడానికి భారతదేశంలోకి ప్రవేశించింది. కృష్ణ మండల్ అనే బంగ్లాదేశ్ మహిళ అభిక్ మండల్‌ను ఫేస్‌బుక్‌లో కలుసుకుని ప్రేమలో పడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: పగపట్టిన పక్కింటోళ్ల కుక్క.. చివరికి ఏమైందంటే ??

Viral: ఈ జిరాఫీని రుచి చూడొచ్చు! మేకింగ్ వీడియో వైరల్‌

రెప్పపాటులో మిస్‌.. లేదంటే ప్రాణం పోయేది.. వీడియో చూస్తే గుండె గుబుల్‌

 

Follow us