Telangana: కొమరంభీం జిల్లా శివారులో భయం భయం.. వెళ్లాలంటే జనాలు దడుసుకుంటారు
కొమురంభీం జిల్లా కాగజ్నగర్లో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పులి పాదముద్రలు గుర్తించారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీపై లుక్కేయండి మరి. మీరూ షాక్ అవుతారు.
కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి పాదముద్రలు గుర్తించినట్లు అటవిశాఖ అధికారులు తెలిపారు. నందిగూడ, వంజిరి, బురదగూడ, గొల్లగూడ, చారీగాం గ్రామల ప్రజలు అప్రమత్తంగా హెచ్చరించారు. పశువుల కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రాకూడదని సూచిస్తున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లొదని… పులి సంచరించిన ఆనవాళ్లు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పులి సంచారంతో శివారు గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే పులి వల్ల పశువులు, మనుషులకు ఎలాంటి హాని జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
వైరల్ వీడియోలు
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

