AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. చిన్నపిల్లలే టార్గెట్‌.!

Corona in Telangana: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. చిన్నపిల్లలే టార్గెట్‌.!

Anil kumar poka
|

Updated on: Dec 25, 2023 | 5:26 PM

Share

కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి కొత్త రూపం సంతరించుకొని ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఇటు భారత్‌లోనూ కరోనా కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరింది.

కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతోంది. కరోనా తగ్గినట్టే తగ్గి కొత్త రూపం సంతరించుకొని ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. ఇటు భారత్‌లోనూ కరోనా కలకలం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరింది. తెలంగాణలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్ లో ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన ఒక మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలను వైద్యులు గుర్తించారు.

వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు.. టెస్టింగ్ కోసం పూణెలోని ల్యాబ్ కు పంపారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తితో అప్రమత్తమైన ఎంజీఎం హాస్పిటల్‌ సిబ్బంది మాస్క్‌ లేనిదే ఆస్పత్రిలోకి ఎవరినీ అనుమతించడంలేదు. సిద్ధిపేటలో కూడా ఒక కేసు నమోదయింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కొవిడ్ కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, టెస్టింగ్ సెంటర్లను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెపుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.