Watch: చింత చెట్టులో వెలసిన దుర్గామాత..! అమ్మ వారికి పూజలు చేస్తున్న భక్తులు

ఆ అమ్మవారు స్వయంగా ఇక్కడ చింతచెట్టులో వెలిశారంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున పూజలు చేయటం మొదలుపెట్టారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారిని చూస్తేందు ఊరూ ఊరంతా బారులు తీరుతున్నారు. ఇదివరకు ఎల్లమ్మగుట్టపై ఆదిమానవుల ఆనవాళ్లు లభ్యమైనట్లు చరిత్రకారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలిపారు.

Watch: చింత చెట్టులో వెలసిన దుర్గామాత..! అమ్మ వారికి పూజలు చేస్తున్న భక్తులు

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 22, 2024 | 11:19 PM

నిర్మల్ జిల్లా భైంసాలో వింత సంఘటన చోటు చేసుకుంది. వానల్ పాడ్ గ్రామంలోని ఎల్లమ్మ గుట్టపై ఎన్నో సంవత్సరాలుగా ఉన్న భారీ చింతవృక్షం కాండంపై విజయ దుర్గామాత ఆకారం కనిపించింది. ఆ అమ్మవారు స్వయంగా ఇక్కడ చింతచెట్టులో వెలిశారంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున పూజలు చేయటం మొదలుపెట్టారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారిని చూస్తేందు ఊరూ ఊరంతా బారులు తీరుతున్నారు. ఇదివరకు ఎల్లమ్మగుట్టపై ఆదిమానవుల ఆనవాళ్లు లభ్యమైనట్లు చరిత్రకారులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కటకం మురళీ తెలిపారు. దసరా ముందు అమ్మవారు వెలవడం శుభపరిణామంగా భావిస్తున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow us