Khammam: ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ముందు ఉద్రిక్తత.. అనూహ్యంగా అమాయకురాలు మృతి.. వీడియో.
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఒక మహిళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరి శవమై తిరిగొచ్చిందని... దీనంతటికీ కారణం వైద్యల...
ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఒక మహిళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స కోసం చేరి శవమై తిరిగొచ్చిందని.. దీనంతటికీ కారణం వైద్యల నిర్లక్ష్యంగా ఆరోపిస్తున్నారామె బంధువులు. దీంతో ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.ఖమ్మం అర్బన్, పుట్టకోటకు చెందిన మాధవి రెండ్రోజుల క్రితం సైనస్ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. సర్జరీ చేస్తున్న సమయంలో మాధవికి గుండెపోటు వచ్చిందనీ. దీంతో ఆమె చనిపోయిందని అంటున్నారు వైద్యులు.అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మాధవి చనిపోయిందని ఆందోళన బాట పట్టారామె కుటుంబ సభ్యులు. కొందరు ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. నిన్నటి నుంచీ చర్చలు సాగుతున్నా.. ఒక కొలిక్కి రావడం లేదు. ఈ రోజు మృతురాలి బంధువులు ఆస్పత్రి సూపరింటెండెంట్ పై దాడికి యత్నించగా.. వీరిని చెదరగొట్టారు పోలీసులు. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos