AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వాటర్ బాటిల్ కొందామని కారు ఆపాడు.. కట్ చేస్తే.. ఊహించని షాకిచ్చారుగా

Andhra: వాటర్ బాటిల్ కొందామని కారు ఆపాడు.. కట్ చేస్తే.. ఊహించని షాకిచ్చారుగా

Ravi Kiran
|

Updated on: Sep 16, 2025 | 12:59 PM

Share

బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేశాడు.. విజయవాడ నుంచి తిరువూరు వెళ్తున్నాడు. సరిగ్గా తిరువూరు బైపాస్ రోడ్డు చేరుకున్నాడు. కాస్త దాహం వేసిందని వాటర్ బాటిల్ కొందామని కారు ఆపాడు. ఆ తర్వాత.! ఏం జరిగింది.. ఈ స్టోరీలో ఓ సారి లుక్కేయండి.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరువూరు బైపాస్ రోడ్డు సమీపంలో ‘AP 39DZ 5858’ కారు అద్దం పగలగొట్టి డాష్ బోర్డులో ఉంచిన లక్ష రూపాయల నగదును చోరీ చేశారు. మండలంలోని ఎర్రమాడుకు చెందిన మొగిలి సురేష్ బ్యాంక్ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసి.. ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో వాటర్ బాటిల్ కోసమని కారు దిగాడు. ఈలోగా కేటుగాళ్లు నిమిషాల వ్యవధిలో కారులోని నగదును మాయం చేశారు. నగదు పోయిందని గ్రహించిన బాధితుడు.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.