Andhra: వాటర్ బాటిల్ కొందామని కారు ఆపాడు.. కట్ చేస్తే.. ఊహించని షాకిచ్చారుగా
బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేశాడు.. విజయవాడ నుంచి తిరువూరు వెళ్తున్నాడు. సరిగ్గా తిరువూరు బైపాస్ రోడ్డు చేరుకున్నాడు. కాస్త దాహం వేసిందని వాటర్ బాటిల్ కొందామని కారు ఆపాడు. ఆ తర్వాత.! ఏం జరిగింది.. ఈ స్టోరీలో ఓ సారి లుక్కేయండి.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తిరువూరు బైపాస్ రోడ్డు సమీపంలో ‘AP 39DZ 5858’ కారు అద్దం పగలగొట్టి డాష్ బోర్డులో ఉంచిన లక్ష రూపాయల నగదును చోరీ చేశారు. మండలంలోని ఎర్రమాడుకు చెందిన మొగిలి సురేష్ బ్యాంక్ నుంచి లక్ష రూపాయలు డ్రా చేసి.. ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలో వాటర్ బాటిల్ కోసమని కారు దిగాడు. ఈలోగా కేటుగాళ్లు నిమిషాల వ్యవధిలో కారులోని నగదును మాయం చేశారు. నగదు పోయిందని గ్రహించిన బాధితుడు.. స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పడ్డారు.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

