Uttam Kumar Reddy: వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీ సాధిస్తాం.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటా : ఉత్తమ్ కుమార్ రెడ్డి.
వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్లో 50 వేల మెజార్టీ సాధిస్తాం. ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసిరారు పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్థంగా పనిచేశానని చెప్పుకొచ్చారు. విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేశానన్నారు. 1994 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నా ఇప్పటికీ తనకు సొంత ఇల్లు లేదన్నారు ఉత్తమ్. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషిచేసినట్టు చెప్పారు. తనకు పిల్లలు లేరన్న ఉత్తమ్… కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలనే పిల్లలుగా భావిస్తున్నట్టు చెప్పారు. కోదాడలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈ కామెంట్స్ చేశారు ఉత్తమ్. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఉత్తమ్
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
దారుణం.. బిస్కెట్లు ఆశ చూపి చిన్నారిపై..
ముగిసిన ఆపరేషన్ టైగర్.. సురక్షితంగా అడవిలోకి బెబ్బులి
ఉద్యోగులకు కార్లు గిఫ్ట్గా ఇచ్చి.. సర్ప్రైజ్ చేసిన కంపెనీ
ఈ పాము కాటేస్తే మరణ శాసనమే.. భూలోక నరకం
చిన్నారిని క్యాబ్లో మరిచిన తల్లితండ్రులు.. చివరికి ??
పెళ్లికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రారాజు.. అతిథులు భయంతో..
రైతును పెళ్ళాడితే రూ.10 లక్షలు.. అంతే కాకుండా

