AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttam Kumar Reddy: వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీ సాధిస్తాం.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటా : ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Uttam Kumar Reddy: వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీ సాధిస్తాం.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటా : ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Anil kumar poka
|

Updated on: Jan 07, 2023 | 9:36 PM

Share

వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్‌లో 50 వేల మెజార్టీ సాధిస్తాం. ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్‌ విసిరారు పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన 30ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్థంగా పనిచేశానని చెప్పుకొచ్చారు. విలువలు, విశ్వసనీయతతో రాజకీయాలు చేశానన్నారు. 1994 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నా ఇప్పటికీ తనకు సొంత ఇల్లు లేదన్నారు ఉత్తమ్‌. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతో కృషిచేసినట్టు చెప్పారు. తనకు పిల్లలు లేరన్న ఉత్తమ్‌… కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గ ప్రజలనే పిల్లలుగా భావిస్తున్నట్టు చెప్పారు. కోదాడలో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఈ కామెంట్స్‌ చేశారు ఉత్తమ్‌. కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఉత్తమ్‌

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 07, 2023 09:36 PM