BJP Public Meeting Live: మిగులు రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ అప్పుల్లో ముంచేశారు : జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ (గురువారం) కరీంనగర్ కు రానున్నారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత పూర్తయింది. కరీంనగర్ లో నిర్వహించే ముగింపు సభలో జేపీ నడ్డా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ (గురువారం) కరీంనగర్ కు రానున్నారు. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదో విడత పూర్తయింది. కరీంనగర్ లో నిర్వహించే ముగింపు సభలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఈ మీటింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సభ జరిగే స్థలంలో సౌకర్యాలు, జన సమీకరణపై దృష్టి సారించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై ఫోకస్ పెట్టింది. బండి సంజయ్ ఇప్పటికే అన్ని జిల్లాల ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే కరీంనగర్ మొత్తం కాషాయమయం అయింది. ప్రధాన రోడ్లకు ఇరువైపులా బీజేపీ అగ్ర నేతల బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆరో విడత పాదయాత్ర హైదరాబాద్లో కొనసాగేలా బీజేపీ ప్లాన్ చేసింది. ఈ ముగింపు సభలోనే ఆరో విడత యాత్ర పై ప్రకటన చేయనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్కు మేయర్ ప్రకటన..
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్వా! డాక్టర్పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

