Watch Video: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆ ఎమ్మెల్యే కీలక సూచన..
బీజేపీ అధిష్టానానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక కీలక సూచన చేశారు. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమయ్యాయి. కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని విన్నవించారు.
బీజేపీ అధిష్టానానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక కీలక సూచన చేశారు. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి నియామకం చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశమయ్యాయి. కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతలతో చర్చించిన తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. ఇలాంటి సమయంలో దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని విన్నవించారు. తెలంగాణలో గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపిలతోపాటూ ఇతర సినీయర్ నేతల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాతే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని నియమించాలని కోరారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలన చూశారని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన చూస్తున్నారని చెప్పారు. ఈక్రమంలోనే వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీకి అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కావిడి కట్టి ..తల్లిని మోసి..3 నెలలు 24 రోజుల పాటు నడిచి
అమ్మాయిలని ఇంప్రెస్ చేయబోయి.. చావు దెబ్బలు తిన్న యువకుడు
అంతరిక్షం నుంచి భూమిపై మీ పేరును వెతుక్కోండి..
బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తల్లడిల్లిన ఆవు.. వైరల్ వీడియో
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్

