Revanth Reddy: రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా టీ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే.. జిల్లాల వారీగా వరుస పర్యటనలు చేస్తూ.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విధంగా లోక్ సభ ఎన్నికల్లోనూ.. అదే స్థాయిలో సత్తా చాటాలని ప్లాన్ రచిస్తున్నారు.

Revanth Reddy: రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

|

Updated on: Apr 27, 2024 | 6:56 PM

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో డబుల్ డిజిట్ సీట్లే లక్ష్యంగా టీ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే.. జిల్లాల వారీగా వరుస పర్యటనలు చేస్తూ.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విధంగా లోక్ సభ ఎన్నికల్లోనూ.. అదే స్థాయిలో సత్తా చాటాలని ప్లాన్ రచిస్తున్నారు. వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని.. ముందడుగు వేస్తున్నారు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు.. రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు..అంటూ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 ఏళ్లలో భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని..1925లోనే ఆర్ఎస్‌ఎస్‌ ప్రతిజ్ఞ చేసిందన్నారు. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మార్చబోతున్నారంటూ పేర్కొన్నారు.

లైవ్ వీడియో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us