AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‎పై విమర్శలు..

Watch Video: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‎పై విమర్శలు..

Srikar T
|

Updated on: Apr 28, 2024 | 9:54 PM

Share

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం రోడ్ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి బీజేపీపై మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కాకుండా శ్రీరాముడి ఫోటోతో బీజేపీ ఓట్లు అడుగుతుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో తగదని విమర్శించారు. మల్కాజిగిరితో పాటు ఎల్బీనగర్‌ రోడ్‌ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ అటు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కూడా సెటైర్లు విసిరారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం రోడ్ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి బీజేపీపై మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కాకుండా శ్రీరాముడి ఫోటోతో బీజేపీ ఓట్లు అడుగుతుందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో తగదని విమర్శించారు. మల్కాజిగిరితో పాటు ఎల్బీనగర్‌ రోడ్‌ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ అటు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కూడా సెటైర్లు విసిరారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయానికి రాలేదని.. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక నియోజకవర్గాలను పర్యటిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు చేసిందేంటని ప్రశ్నించారు. గతంలో ప్రజలు ఎవరైనా ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తే గంటల తరబడి బయటే కూర్చోపెట్టారని మండిపడ్డారు. ప్రజాగాయకుడు గద్దర్‎ను కూడా గేటుబయటే కూర్చోబెట్టారని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ కు ఓటు వేయమని ప్రజలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..