Watch Video: ఏపీ ఎన్నికల్లో పోటీపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు..
రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. తమ పార్టీలో చేరడానికి ఎంతో మంది ఉత్సహం చూపిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వాలని చాలా మంది అడుగుతున్నారని వెల్లడించారు.
రానున్న ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. తమ పార్టీలో చేరడానికి ఎంతో మంది ఉత్సహం చూపిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వాలని చాలా మంది అడుగుతున్నారని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. పెద్ద ఆశయాలతో తామ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. అభివృద్ధి, ఉపాధి, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫోస్టోని రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట, జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని ఆయన సందర్శించారు. కోనసీమను ఆధ్మాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని వీవీ లక్ష్మీనారాయణ అన్నారు.
మరికొన్ని మాసాల్లో ఆంధ్ర ప్రదేశ్లో జమిలి ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని లక్ష్మీనారాయణ ప్రకటించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

