Chandrababu: న్యూసెన్స్ చేస్తే జైలులో వేస్తాం.. డ్రామాలాడితే తడాఖా చూపిస్తాం.. సీఎం చంద్రబాబు వార్నింగ్
బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంద్ చేయాలి.. ఫేక్ పాలిటిక్స్కు కాలం చెల్లింది.. డ్రామాలు ప్లే చేస్తే ఖబడ్దార్.. న్యూసెన్స్ చేస్తే బొక్కలో వేస్తాం.. ఇకపై సహించేదిలేదు.. పొలిటికల్ ఎటాక్ గ్యారెంటీ.. ఇదీ.. ముఖ్యమంత్రి చంద్రబాబులోని మరో డిఫరెంట్ షేడ్.. ఎస్.. సార్.. మారిపోయారు.. డీసెంట్గా మాట్లాడే చంద్రబాబు.. గతానికి భిన్నంగా వార్నింగ్లతో విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా మాస్ లీడర్లా మారిపోయారు.
ఏపీలోని తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సారి డిఫరెంట్గా ఫుల్ ఖుషీగా.. నవ్వుతూ.. హుషారుగా.. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వివిధ అంశాలపై ప్రసంగించిన చంద్రబాబు.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీపై కన్నెర్ర చేశారు. జగన్ టార్గెట్గా పలు ఇంట్రిస్టింగ్ కామెంట్స్, వార్నింగ్లు ఇచ్చారు. ప్రధానంగా.. వైసీపీ ప్రతిపక్ష హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడిస్తారో.. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్కు సూచించారు. వైసీపీ అసత్య ప్రచారాలపైనా సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక.. రెండు రోజల క్రితం పులివెందుల పర్యటనలో ఉల్లి, చీనీ పంటల రైతుల సమావేశంలో మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో పులివెందులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ జగన్పై సెటైర్లు వేశారు. డ్రామాలాడితే తడాఖా అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
మొత్తంగా.. ఏపీ సీఎం చంద్రబాబు డిఫరెంట్ స్టయిల్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఎప్పుడూ కూల్గా మాట్లాడే చంద్రబాబు.. గతానికి భిన్నంగా వార్నింగ్లతో.. మాస్ లీడర్లా మారిపోయారు. అదేసమయంలో.. కొందరు వైసీపీ నేతలు కావాలని రెచ్చగొడితే రెచ్చిపోవద్దని.. సంయమనం పాటించాలని టీడీపీ వర్గాలకు సూచించారు సీఎం చంద్రబాబు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
లక్కీ డ్రా తీయండి.. కూరగాయలు ఉచితంగా పొందండి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్

