ఆలయంలో నంది విగ్రహం చోరీ వీడియో
శ్రీ సత్యసాయి జిల్లాలోని ముష్టి కోవెల శివాలయంలో సెప్టెంబర్ 12న రాయలకాలం నాటి నంది విగ్రహం చోరీకి గురైంది. విగ్రహంలో వజ్రాలున్నాయనే ప్రచారంతో కొందరు దుండగులు దీనిని అపహరించారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేసి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్ణాటకకు చెందినవారుగా గుర్తించారు.
శ్రీ సత్యసాయి జిల్లా సీకే పల్లి మండలం ముష్టి కోవెలలోని శివాలయంలో ఒక నంది విగ్రహం చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నంది విగ్రహంలో వజ్రాలు ఉన్నాయన్న ప్రచారం స్థానికంగా జరగడంతో, కొందరు దుండగులు దానిని అపహరించారు. సెప్టెంబర్ 12న పక్కా ప్రణాళికతో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు, నంది విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిపోయారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నంది విగ్రహం కృష్ణదేవరాయుల కాలం నాటిది. రాయల కాలంలో వజ్రవైఢూర్యాలు పుష్కలంగా ఉండేవని, అందువల్ల ఈ విగ్రహంలోనూ వజ్రాలు ఉండవచ్చనే నమ్మకంతో దొంగలు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
మధ్యప్రదేశ్ను వణికిస్తున్న కొత్త వైరస్ వీడియో
రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
దసరా సర్ప్రైజ్ ఇచ్చిన సామ్.. ఆనందంలో ఫ్యాన్స్ వీడియో
ఒక్క షో కోసం ఎంతో కష్టపడ్డా.. కానీ ఇప్పుడు వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం..
యజమాని మెసేజ్కు ఫిదా నెటిజన్లు

