రోడ్డుమధ్యలో వింత ఆకారం..ఆందోళనలో స్థానికులు వీడియో
పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో రోడ్డు మధ్యలో నిర్వహించిన క్షుద్రపూజలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. ఐదు అడుగుల మానవ బొమ్మలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో చేసిన ఈ పూజలు జనవాసాల మధ్య భయానక వాతావరణాన్ని సృష్టించాయి. దీనిపై ప్రజలు కఠిన చర్యలు కోరుతున్నారు.
రోజురోజుకు సమాజంలో మూఢనమ్మకాలు పెరుగుతున్నాయని పల్నాడు జిల్లాలోని ఓ ఘటన వెల్లడిస్తోంది. టెక్నాలజీ యుగంలోనూ కొందరు క్షుద్రపూజలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలోని మాచర్ల మండలంలో, వేమవరం నుండి చెన్నాయపాలెం వెళ్లే రహదారి నుండి పొలాలకు వెళ్లే మార్గంలో క్షుద్రపూజలు నిర్వహించారు.రోడ్డు మధ్యలో ఐదు అడుగుల ఎత్తున రెండు మానవ బొమ్మలను ముగ్గుతో వేసి, వాటిపై పసుపు, కుంకుమ చల్లారు. నిమ్మకాయలతో పూజలు చేశారు. కుంపటిలో దీపాలు పెట్టిన ఆనవాళ్లు కూడా కనిపించాయి.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్కు గిఫ్ట్గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

