AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రికార్డు ధర పలికిన మైహోం భుజా గణపతి లడ్డూ

Hyderabad: రికార్డు ధర పలికిన మైహోం భుజా గణపతి లడ్డూ

Ram Naramaneni
|

Updated on: Sep 04, 2025 | 4:06 PM

Share

రాయ‌దుర్గంలోని మై హోమ్ భుజాలో గ‌ణేశ్ ల‌డ్డూ భారీ ధ‌ర ప‌లికింది. కొండపల్లి గ‌ణేశ్ అనే వ్య‌క్తి రూ. 51,77,777కు లడ్డూ ద‌క్కించుకున్నాడు. గ‌తేడాది ఇక్క‌డ ల‌డ్డూ ధ‌ర రూ. 29 ల‌క్ష‌లు ఈ వ్యక్తే లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం.

హైదరాబాద్ మైహోం భుజా లడ్డూ ఈసారి తన రికార్డు ధరను అందుకుంది. వేలంలో లడ్డూకు 51 లక్షల 77 వేల 777 రూపాయల ధర పలికింది.
ఈ లడ్డూ కోసం జరిగిన వేలంల ఎంతో మంది పోటీ పడ్డారు. లడ్డూ వేలంలో గణేష్‌ అనే వ్యక్తి.. ఏకదంతుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ గత ఏడాది కూడా ఈ లడ్డూను విజయవంతంగా కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. గత ఏడాది వేలంలో 29 లక్షలు పలికిన లడ్డూ ధర, ఈ సారి ఏకంగా 50 లక్షలు దాటడం విశేషం. ఖమ్మం జిల్లాకు చెందిన గణేష్ తమ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచారు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సమాచారం.