హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ – మౌలాలి MMTS రైలు మార్గం రెడీ

హైదరాబాద్ ఎమ్ఎమ్‌టీఎస్ రెండో దశ పనులు మొత్తం పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. రక్షణశాఖ - రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఇందులో భాగంగా 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుద్దీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారు. సనత్‌నగర్- మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైను రెడీ అయ్యింది. ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ఈ రైల్వేలైను ప్రారంభం కానుంది.

హైదరాబాద్‌లో సనత్‌నగర్‌ - మౌలాలి MMTS రైలు మార్గం రెడీ

|

Updated on: Feb 12, 2024 | 9:35 PM

హైదరాబాద్ ఎమ్ఎమ్‌టీఎస్ రెండో దశ పనులు మొత్తం పూర్తిచేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. రక్షణశాఖ – రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఇందులో భాగంగా 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుద్దీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారు. సనత్‌నగర్- మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో లైను రెడీ అయ్యింది. ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ఈ రైల్వేలైను ప్రారంభం కానుంది. మార్చి మొదటి వారంలో చర్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో.. అదే రోజున సనత్ నగర్-మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర ఎమ్ఎమ్‌టీఎస్ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు. ఈ రైల్వేలైను ప్రారంభంతో మాల్కాజిగిరి, ఆల్వాల్ ప్రాంతాలకు చెందిన టెకీల కష్టాలు తీరనున్నాయి. MMTS మౌలాలి- సనత్‌నగర్, హైటెక్‌సిటీ మీదుగా అందుబాటులోకి రావడంతో వీరంతా సులువుగా గమ్యస్థానాలకు చేరే అవకాశం ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖతర్‌ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారులు విడుదల

విమానంలో చక్కర్లు .. మహిళ ఇంటిపై టమాటాలు విసురుతూ టీజింగ్‌

అడవి జంతువుల వేట.. గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ని బలి తీసుకుంది

ఆటో డ్రైవర్‎కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే

కొడుకునంటూ తిరిగొచ్చిన సన్యాసి.. అసలు సన్యాసే కాదట

Follow us