Vande Bharat Express: కాచిగూడ – బెంగళూరు వందేభారత్.. పంద్రాగస్టున పట్టాలెక్కేందుకు సిద్దం.!
Kacheguda To Bengaluru Vande Bharat Express: కాచిగూడ నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు మధ్యాహ్నం రెండున్నర గంటలకు డోన్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. మార్గం మధ్యలో కర్నూలులోన వందేభారత్ ఎక్స్ప్రెస్ను అధికారులు భోజనం కోసం నిలిపారు. కర్నూలుకు వందే భారత్ రైలు వస్తుందన్న సమాచారంతో రైలును చూసేందుకు నగరవాసులు వచ్చారు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ ట్రైన్కు సంబంధించిన..
సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ఇక దానికి సంబంధించిన పనులను శరవేగంగా చేస్తున్నారు రైల్వే అధికారులు. కాచిగూడ నుంచి డోన్ వరకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును బుధవారం అధికారులు ట్రైల్ రన్ నిర్వహించారు. ఉదయం కాచిగూడ నుంచి బయలుదేరిన వందే భారత్ రైలు మధ్యాహ్నం రెండున్నర గంటలకు డోన్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. మార్గం మధ్యలో కర్నూలులోన వందేభారత్ ఎక్స్ప్రెస్ను అధికారులు భోజనం కోసం నిలిపారు. కర్నూలుకు వందే భారత్ రైలు వస్తుందన్న సమాచారంతో రైలును చూసేందుకు నగరవాసులు వచ్చారు. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. కాగా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ రైలు ప్రతి రోజూ కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్పూర్ వరకు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ ట్రైన్ టైమింగ్స్, టికెట్ల వివరాలు, ఆగే స్టేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

