రాత్రిపూట పెరుగు తినకూడదా? తింటే ఏమవుతుంది..?వీడియో
భారతీయ ఆహారంలో పెరుగు ఒక ముఖ్యమైన ఆహారం. ఇది రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. వేసవిలో చల్లదనాన్ని అందించడం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు పెరుగు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. పురాతన కాలం నుండి పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో ప్రోబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. కానీ ప్రతిదానికి సరైన సమయం ఉంటుంది. ఇది పెరుగు విషయంలో ప్రత్యేకంగా వర్తిస్తుందంటున్నారు నిపుణులు.
పెరుగును రాత్రిపూట తింటే పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. రాత్రిపూట పెరుగు తింటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రాత్రిపూట శరీర జీవక్రియ నెమ్మదిస్తుందంట. అందుకే రాత్రి సమయంలో తినకూడదంటారు. ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫదోషం పెరుగుతుంది. ఇది గొంతునొప్పి ముక్కు దిబ్బడ లేదా ఉదయం నిద్ర లేచినప్పుడు బరువుగా అనిపించడానికి కారణమవుతుంది. చల్లని స్వభావం కారణంగా రాత్రిపూట పెరుగు తినడం వల్ల జలుబు, ఫ్లూ దగ్గు వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా ఇది పిల్లలకు బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుంది. కొంతమందికి రాత్రిపూట పెరుగు తిన్న తర్వాత చర్మ అలర్జీలు మొటిమలు లేదా దురద వంటి సమస్యలు కూడా ఎదరవుతాయంట. అలాగే కీళ్లనొప్పులతో బాధపడేవారు రాత్రిపూట పెరుగు తినడం వల్ల కీళ్లనొప్పులు మరింత పెరుగుతాయని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. రాత్రిపూట పెరుగు తినే అలవాటు ఉంటే అందులో కొద్దిగా నల్ల మిరియాలు కలిపి తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది దాని కూలింగ్ ప్రభావాన్ని కొద్దిగా సమతుల్యం చేస్తుంది. పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ దానిని సరైన సమయంలో తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :