కూరగాయల్ని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదంటే?
కూరగాయలని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఆహారంలో పోషక విలువలను అత్యధికంగా నిలుపుకోవాలంటే ఆవిరి మీద ఉడికించడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నీటిలో కరిగే బి,సి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఆవిరిలో ఉడికించే పద్ధతిలో ఆహారం నేరుగా నీటితో సంబంధం లేకుండా ఆవిరితో మాత్రమే ఉడుకుతుంది కాబట్టి పోషకాలు నీటిలో కరిగి బయటికి పోకుండా ఉంటాయి.
ఈ పద్ధతికి అదనపు నూనె లేదా కొవ్వు అవసరం లేదని, ఇది ఆరోగ్యకరమైన ఎంపిక అని నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహారాలను నీటిలో త్వరగా ఉడికించవచ్చు. పెద్ద మొత్తంలో ఆహారాన్ని మండటానికి అనుకూలంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఏ,బి విటమిన్లు ఇంకొన్ని ఖనిజాలు వంట నీటిలో కరిగిపోతాయి. వంట నీటిని పారబోసినట్లయితే ఈ పోషకాలను కోల్పోతాం. కానీ సూప్లు, పాస్తా, అన్నం, పప్పులు, ఉడికించిన గుడ్లు వంటి వంటకా లకు నీటిలో ఉడికించడం తప్పనిసరి. ప్రతి వంట పద్ధతికి దానిదైన ప్రయోజనాలు ఉంటాయని వండే ఆహారాన్ని బట్టి సరైన పద్ధతిని ఎంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గాలనుకున్నా, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నా, లేదా మెరుగైన చర్మం కావాలనుకున్నా ఆవిరితో ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు. అంతేకాకుండా ఆవిరి మీద ఉడికించడం వల్ల కూరగాయలు సహజ రుచిని మెరుగుపడుతుంది. నిపుణుల సూచనల ప్రకారమే మీ అవగాహన కోసం మాత్రమే మీకు ఈ సమాచారం అందించాం. ఆరోగ్య సమస్యలు ఉన్న వీటిని పాటించే ముందు వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??
రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు
బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్
ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు

