రన్వేపై డిన్నర్.. ప్రయాణికులకు ఇండిగో క్షమాపణ
ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో విమానం పక్కనే రన్వేపై కూర్చొని ప్రయాణికులు డిన్నర్ చేసిన ఘటనపై దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో స్పందించింది. ప్రయాణికులను క్షమాపణలు కోరింది. రన్వేపై కూర్చొని ప్యాసింజర్లు ఇబ్బందికరంగా భోజనం చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఇండిగో దిగొచ్చింది. క్షమాపణ కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల ముంబై ఎయిర్పోర్టులో విమానం పక్కనే రన్వేపై కూర్చొని ప్రయాణికులు డిన్నర్ చేసిన ఘటనపై దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో స్పందించింది. ప్రయాణికులను క్షమాపణలు కోరింది. రన్వేపై కూర్చొని ప్యాసింజర్లు ఇబ్బందికరంగా భోజనం చేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఇండిగో దిగొచ్చింది. క్షమాపణ కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపింది. ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని, నిరంతరాయంగా సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. కాగా జనవరి 14న గోవా నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముంబై మళ్లించారు. ప్రయాణికులు అక్కడ చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో వారికి రన్వేపైనే భోజనాన్ని ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఆలయంలో రాచగుమ్మడి రహస్యం !! ఒక్క గుమ్మడికాయతో కోరికలు తీర్చే వీరభధ్రుడు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

