ఎందుకంత లావైపోతున్నారు.. ఫిట్‌నెస్‌ని లైట్ తీసుకుంటున్నారా..?

ఎందుకంత లావైపోతున్నారు.. ఫిట్‌నెస్‌ని లైట్ తీసుకుంటున్నారా..?

Phani CH

|

Updated on: Feb 04, 2025 | 8:03 PM

ఈ ఏడాది న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏం తీసుకున్నారని ఎవరినైనా అడిగితే..ఎక్కువ మంది నుంచి వచ్చే ఒకే సమాధానం ఏంటో తెలుసా..? జిమ్‌కి వెళ్లాలి, ఫిట్‌నెస్ పెంచుకోవాలని. కానీ ఆ హడావుడి అంతా ఆ ఒక్క రోజే. ఎవరో కొంత మంది చాలా స్ట్రిక్ట్‌గా దాన్ని ఫాలో అయిపోతారు. చాలా మంది స్కిప్ చేసేస్తారు. ఫిట్‌నెస్‌ని ఇలా లైట్ తీసుకోవడం వల్లే క్రమంగా వెయిట్ పెరిగిపోతున్నారు.

గతేడాది వరల్డ్ ఒబెసిటీ డే సందర్భంగా లాన్సెట్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం..ఇండియాలోని పట్టణాల్లో నివసించే వాళ్లలో దాదాపు 70% మంది ఓవర్‌వెయిట్‌తో బాధ పడుతున్నారు. అత్యధికంగా ఒబెసిటీ బాధితులున్న దేశాల్లో అమెరికా, చైనా తరవాత స్థానం భారత్‌దే. దాదాపు 8 కోట్ల మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నంబరే టెన్షన్ పెడుతోంది అనుకుంటే..ఏజ్‌గ్రూప్‌కి సంబంధించిన వివరాలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. 5 నుంచి 19 ఏళ్ల లోపు వాళ్లే ఈ ఒబెసిటీ బాధితులుగా ఉంటున్నారు. ఇండియాలో ఆరు కోట్ల మందిలో ఒబెసిటీ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీగా పొట్ట రావడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం లాంటి సింప్టమ్స్ ఉంటున్నాయి. వీళ్లంతా ఒబెసిటీకి దగ్గర్లో ఉన్న వాళ్లే. ఉన్నట్టుండి ఇప్పుడు ఒబెసిటీ గురించి మాట్లాడడానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో ఒబెసిటీ గురించి ప్రస్తావించారు. దేశంలో చాలా మంది ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని, ఈ కారణంగా గుండె సంబంధిత వ్యాధులతో పాటు డయాబెటిస్ వస్తోందని చెప్పారు. ఇదే సమయంలో ఆయన ఫిట్ ఇండియా ఉద్యమం గురించీ మాట్లాడారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జలకన్య వేషంలో యువతి.. దాడి చేసిన భారీ చేప

ఒంట్లో ఐరన్‌ తగ్గిందా.. అయితే ఇలా చేయండి

బండికి పెట్రోల్ కొట్టించాడు.. కిక్ కొట్టగానే ఊహించని సీన్

డీప్ సీక్ సృష్టికర్త లియాంగ్‌.. బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాకవుతారు!

Mohammed Siraj: బిగ్ బాస్ బ్యూటీకి మహమ్మద్ సిరాజ్ బౌల్డ్