Rajasthan: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త కన్నింగ్ ప్లాన్.. పోలీసులే షాక్..! వీడియో
సమాజంలో రోజు రోజుకీ విలువలు తగ్గిపోతున్నాయడానికి జరుగుతోన్న సంఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. డబ్బు కోసం కొందరు ఎంతటి దారుణానికైనా దిగజారుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణం అందరినీ షాకింగ్కు గురిచేసింది.
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన షాలూ, మహేశ్ చంద్ భార్య భర్తలు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో షాలూ కొన్ని రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. అయితే తమ మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలంటే 11 వారాల పాటు పూజా చేయాలని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని భార్యను నమ్మించాడు మహేశ్. భర్త మాటలు నిజమని నమ్మిన షాలూ.. రోజు ఉదయం సోదరుడితో ఆలయానికి వెళ్తోంది. ఈక్రమంలోనే వెళ్తుండగా.. షాలూను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన సోదరుడు చికిత్స పొందుతున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదట ఇది ప్రమాదమేనని భావించిన పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. షాలూను భర్త మహేశ్ చంద్ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తమదైన స్టైల్లో అడగడంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇలా చేశానని ఒప్పుకున్నాడు. రౌడీ షీటర్ ముఖేశ్ సింగ్తో కలిసి ఆమె హత్యకు ప్లాన్ చేశాడు మహేశ్. లెక్కిస్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

