తాజ్మహల్ గదుల్లో దేవతా విగ్రహాలు.. పురావస్తు శాఖ క్లారిటీ..
చారిత్రక కట్టడం తాజ్మహల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై భారత పురావస్తు శాఖ క్లారిటీ ఇచ్చింది.
చారిత్రక కట్టడం తాజ్మహల్లో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై భారత పురావస్తు శాఖ క్లారిటీ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం కింద ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తాజ్ మహల్లో దేవతా విగ్రహాలు ఉన్నాయన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. తాజ్ మహల్ నేలమాళిగల్లో మూసి ఉన్న గదులు కానీ, హిందూ దేవతల విగ్రహాలు కానీ లేవని పురావస్తుశాఖ క్లారిటీ ఇచ్చింది. తాజ్మహల్ నేలమాళిగలో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ఇటీవల ప్రచారం జరిగింది. అందులో మూసి ఉన్న 22 గదులను తెరవాలని.. అయోధ్య బీజేపీ మీడియా ఇన్ఛార్జి డా.రజనీశ్ కుమార్ 2022, మే 7న అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ గదులు తెరిచేలా ఏఎస్ఐకి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. కాగా ధర్మాసనం దీనిని తోసిపుచ్చింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి సాకేత్ గోఖలే.. జూన్ 21న సమాచార హక్కు చట్టం కింద పురావస్తు శాఖవారిని కొన్ని ప్రశ్నలు అడిగారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కోడి మామూలుది కాదురోయ్..యాక్టింగ్లో ఆస్కార్ పక్కా..
ముందు నుయ్యి వెనుక గొయ్యి.. పాపం జింకల పరిస్థితి చూస్తే కంటతడి పెట్టాల్సిందే
కుర్రోడు మాంచి ఫైర్ మీదున్నాడు’ VD పై జాహ్నవి బోల్డ్ కామెంట్స్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

