AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రెండ్ ను ఇంటికి పిలిచి.. తుపాకీతో కాల్చిన ఇద్దరు విద్యార్థులు

ఫ్రెండ్ ను ఇంటికి పిలిచి.. తుపాకీతో కాల్చిన ఇద్దరు విద్యార్థులు

Phani CH
|

Updated on: Nov 10, 2025 | 6:42 PM

Share

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. పాత గొడవల నేపథ్యంలో ఇద్దరు మైనర్ విద్యార్థులు తమ స్నేహితుడిని ఇంటికి పిలిచి తుపాకీతో కాల్చారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితులైన ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం వెలుగుచూసింది. పాత గొడవల నేపథ్యంలో ఇద్దరు మైనర్ విద్యార్థులు తమ స్నేహితుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు.

హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణం వెలుగుచూసింది. పాత గొడవల నేపథ్యంలో ఇద్దరు మైనర్ విద్యార్థులు తమ స్నేహితుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటన గురుగ్రామ్ లోని సెక్టార్ 48 ఏరియాలో నివసించే విద్యార్థుల మధ్య జరిగింది. స్థానిక ప్రైవేట్ స్కూల్లో ఇంటర్ చదువుతున్న ఈ ఇద్దరు విద్యార్థులు గతంలో జరిగిన ఓ గొడవను మనసులో పెట్టుకొని తమ క్లాస్ మేట్ ను ఇంటికి పిలిచారు.
రాత్రి కేర్కి దౌలా టోల్ ప్లాజా వద్ద ముగ్గురు విద్యార్థులు కలిశారు. అనంతరం, ఒక విద్యార్థి తన తండ్రికి చెందిన లైసెన్స్ పొందిన పిస్టల్‌తో స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్లామర్ షో చాలు.. ఇక నటిస్తామంటున్న కుర్ర హీరోయిన్లు

Pawan Kalyan: కథలు రెడీ.. పవన్ రెడీగా ఉన్నారా

ముంబైలోనే సెటిల్ అవ్వాలని చూస్తున్న ఆ హీరోయిన్లు

వానర యుద్ధం అంటే ఇదే.. భయంతో ప్రజలు పరుగో పరుగు

హే కోతి లెవ్! అది బండరాయి కాదే.. బట్టతల.. దిగు.. దిగు