Diwali Sweets: దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.

Diwali Sweets: దీపావళికి స్వీట్స్, స్నాక్స్ కొంటున్నారా.? ఓసారి ఈ వీడియో చూడండి.

|

Updated on: Oct 27, 2024 | 9:51 AM

కంటికి బాగా కనిపించే ఫుడ్ ను చూస్తే.. వెంటనే తినేయాలనిపిస్తుంది. నోట్లో పెట్టుకోగానే.. అమృతంలా అనిపిస్తుంది. టేస్ట్ బాగుంది కదా అని లొట్టలు వేసుకుంటూ మరీ లాగించేస్తారు. ఎప్పుడూ తిన్నదానికన్నా ఓ రెండు ముద్దలు ఎక్కువే తింటారు. ఇంతవరకు ఓకే. ఇంతకీ మీరు తింటున్నదంతా మంచి ఫుడ్డేనా? అంటే.. అది స్వచ్ఛమైన పదార్థాలతోనే తయారుచేసిందా? లేక కల్తీ జరిగిందా? ఎందుకంటే..

ఈమధ్య హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఛాట్ సెంటర్లు.. బేకరీలు, ఐస్ క్రీమ్ షాపులు, స్వీట్ షాపులు.. ఇలా అన్నింటిపైనా అధికారులు దాడులు చేస్తున్నప్పుడు ఆహారం కల్తీ అవుతోంది అన్నది క్లియర్ గా కనిపిస్తోంది. అధికారుల రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి. హైదరాబాద్ మొదలు.. అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ఆఖరికి.. ఎంత దుర్మార్గంగా తయారయ్యారు అంటే.. పిల్లలు తాగే పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు. పాలు ఒక్కటే కాదు.. బయట తయారయ్యే ప్రతీ ఆహారంలోనూ కల్తీ జరుగుతోంది. పేరున్న సంస్థలు కూడా కల్తీకి పాల్పడుతున్నాయి. దీంతో తాము తింటున్నది నాణ్యమైన పదార్థాలతో తయారైన ఫుడ్డో కాదో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు వినియోగదారులు. మరి వారు ఈ పరిస్థితి నుంచి బయటపడేదెలా? కల్తీకి సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయి? ప్రభుత్వాలు ఏం చేయాలి?

కల్తీ ఆహారం వల్ల ఏటా 10 కోట్లమందికి అనారోగ్యం
కల్తీ ఆహారం వల్ల ఏటా దాదాపు 70 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు

కుళ్లిపోయిన కూరగాయలు, ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ముడి పదార్థాలతో ఆహారం తయారుచేసేస్తున్నారు. కంటికి బాగా కనిపించేలా అందంగా డెకరేట్ చేస్తారు. నోటికి రుచిగా ఉండేలా రకరకాల ఫ్లేవర్లు మిక్స్ చేస్తారు. అదే కూరగాయలు, మాంసాహారం లాంటివి కుళ్లిపోయినా సరే.. వాటి ఒరిజినల్ టేస్ట్ తెలియకుండా.. మసాలా దట్టిస్తారు. దీంతో వినియోగదారులు.. పైపై మెరుపులు చూసి మోసపోతున్నారు. కానీ అలాంటి నాణ్యత లేని, కల్తీ అయిన ఆహారం తినడం వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ను చూస్తే.. కల్తీ ఆహారం వల్ల ఏటా 10 కోట్లమందికి అనారోగ్యం తప్పడం లేదు. దాదాపు 70 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తరచుగా హాస్పటల్స్ కు వెళుతున్నవారిలో 20 శాతం మంది.. కల్తీ ఆహార బాధితులే.

ఆహార ఉత్పత్తులను అమ్మడానికి FSSAI అనుమతి తప్పనిసరి

మార్కెట్లో ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ ను అమ్మాలంటే.. FSSAI అనుమతి తప్పనిసరి. ఇది ప్రతీ ఆహార ఉత్పత్తిని తనిఖీ చేసి లైసెన్స్ ఇస్తుంది. కానీ కొందరు వ్యాపారులు.. ఈ సంస్థ పర్మిషన్ లేకుండానే అమ్మేస్తున్నారు. నిజానికి ఆహార కల్తీకి పాల్పడేవారిని శిక్షించడానికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆహార కల్తీ నిరోధక చట్టం, వంట నూనెల నియంత్రణ చట్టం, ఆహార భద్రతా ప్రమాణాల చట్టం, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం, నిత్యావసరాల సరకుల నియంత్రణ చట్టం.. ఇలా కొన్ని చట్టాలు ఉన్నాయి. కానీ వీటిని సరిగా అమలు చేయకపోవడం వల్లే కల్తీ సమస్య ఎదురవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us